AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ.. భారతీయ విద్యార్ధులకు అడ్డాగా మారనున్న ఆ దేశం!

దేశంలో జరుగతున్న DAAD 65వ జూబ్లీ ఉత్సవాలు, ప్రపంచ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 80కి పైగా జర్మన్ యూనివర్సిటీలు, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు మార్చి నెలలో భారత్‌ని సందర్శిస్తున్నాయి. ఇండో-జర్మన్ విద్యా సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది. ఈ ప్రతినిధి బృందం దేశ వ్యాప్తంగా ఉన్న..

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ.. భారతీయ విద్యార్ధులకు అడ్డాగా మారనున్న ఆ దేశం!
Indo German Academic Collaboration
Srilakshmi C
|

Updated on: Mar 21, 2025 | 1:22 PM

Share

80కి పైగా జర్మన్ యూనివర్సిటీలు, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు మార్చి నెలలో భారత్‌ని సందర్శిస్తున్నాయి. దేశంలో జరుగతున్న DAAD 65వ జూబ్లీ ఉత్సవాలు, ప్రపంచవ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ సందర్శన జరుగుతుంది. ఇండో-జర్మన్ విద్యా సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది. ఈ ప్రతినిధి బృందం దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో జరుగుతున్న వివిధ ఉన్నత స్థాయి కార్యక్రమాలలో పాల్గొననుంది. అలాగే కోయంబత్తూరులోని PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో జర్మన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో, ఇండో-జర్మన్ ఫోరమ్: పరిశోధన, ఆవిష్కరణ కార్యక్రమం, న్యూఢిల్లీలో జరిగే APAIE కాన్ఫరెన్స్ 2025లో పాల్గొంటుంది.

జర్మన్ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సైన్స్, ఎడ్యుకేషన్‌లో ఇండో-జర్మన్ భాగస్వామ్యం గతంలో కంటే బలంగా ఉంది. ఇది మా ద్వైపాక్షిక సంబంధాల నిర్మాణ విభాగాలలో ఒకటి. జర్మనీలో దాదాపు 50 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అతిపెద్ద విదేశీ విద్యార్థులు కలిగిన దేశం ఇది. భారతీయ శాస్త్రవేత్తలు తమ ప్రతిభ, ఆశయాలు, ఆవిష్కరణలతో మా పరిశోధనా రంగానికి దోహదపడుతున్నారు. ఈ మార్పిడి ప్రతి సంవత్సరం చాలా డైనమిక్‌గా పెరుగడం ఆనందంగా ఉందని అకెర్మాన్ అన్నారు. మార్చి 16 నుంచి 22 వరకు ఈ బృందం పర్యటన ఉంటుంది. ప్రముఖ జర్మన్ విశ్వవిద్యాలయాల అధిపతులు, విద్యా ప్రతినిధులు హైదరాబాద్, న్యూఢిల్లీకి వచ్చారు. జర్మనీ – భారత్ మధ్య విద్యా సంబంధాలను మరింతగా బలోపేతం చేయడం, ఉమ్మడి పరిశోధన ప్రయత్నాలను ప్రోత్సహించడం లక్ష్యంగా సంస్థాగత భాగస్వామ్యాలు, కొత్త విద్యా సహకారాలు లక్ష్యంగా చర్చలు సాగుతున్నాయి.

కోయంబత్తూరులోని PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో జర్మన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రారంభం మరొక ప్రధాన పరిణామం. ఇండో-జర్మన్ విద్యా సహకారంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ జర్మన్ అప్లైడ్ సైన్సెస్ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరయ్యారు. DAAD ఆర్థికంగా మద్దతు ఇస్తున్న ఈ చొరవ.. టెక్నాలజీ, ఇంజనీరింగ్‌లో విద్యను ముందుకు తీసుకెళ్లడానికి, పరిశ్రమ-సంబంధిత నైపుణ్యాలను, పరిశోధన-ఆధారిత ఆవిష్కరణలను పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని DAAD ప్రాంతీయ కార్యాలయం డైరెక్టర్ కట్జా లాష్ మాట్లాడుతూ.. DAAD ఉత్సవాల్లో 80కి పైగా జర్మన్ ఉన్నత విద్యా సంస్థలు పాల్గొనడం మా విద్యా సంబంధాలను మరింతగా పెంచుకోవడంలో పెరుగుతున్న చొరవను చూపిస్తుంది. భారత్, జర్మనీ మధ్య ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలలో భాగస్వామ్యాలతో సహా విద్యా, పరిశోధన మార్పిడిని మెరుగుపరచడానికి మా నిబద్ధతను ఈ కార్యక్రమాలు ప్రదర్శిస్తాయని అన్నారు.

ఇవి కూడా చదవండి

మార్చి 25 నుండి 27 వరకు న్యూఢిల్లీలో జరిగే APAIE 2025లో కూడా ప్రతినిధి బృందం పాల్గొంటుంది. పెద్ద ఎత్తున జర్మన్‌ యూనివర్సిటీలు భారత్‌ను సందర్శించడం.. ఉన్నత విద్య, పరిశోధనలో తన సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జర్మనీ బలమైన ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.