APPSC: ఏపీలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు.. ఆ సర్టిఫికేట్‌ లేకుంటే నో జాబ్‌..

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) భర్తీ చేసే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకానికి ఇకపై..

APPSC: ఏపీలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు.. ఆ సర్టిఫికేట్‌ లేకుంటే నో జాబ్‌..
APPSC
Follow us

|

Updated on: Feb 25, 2023 | 8:51 PM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) భర్తీ చేసే గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాల నియామకానికి ఇకపై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు (సీపీటీ) సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్‌సీ, ఏపీ సాంకేతిక విద్యా మండలి నిర్వహించే సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా గ్రూపు-2, గ్రూపు-3 సర్వీసుల్లో నియామకానికి అవకాశం లేదంటూ అడహాక్ నిబంధనలు జారీ చేశారు. దీంతో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా గ్రూపు-2, గ్రూపు-3 ఉద్యోగాలకు నియమితులయ్యే అభ్యర్ధులంతా సీపీటీ తప్పనిసరిగా పాస్ కావాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రకటన జారీ చేసింది. సీపీటీ పరీక్ష వంద మార్కులకు నిర్వహించనున్నట్టు జనరల్ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ పోలా భాస్కర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 30 మార్కులు సాధిస్తే సరిపోతుందని తెల్పింది. బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఈ పరీక్షలో కంప్యూటర్లు, డిజిటల్‌ పరికరాలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్ విండోస్‌, ఇంటర్నెట్‌ తదితర అంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. ఐతే గ్రూపు-1 ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధనలు వర్తించవంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.