Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈపీఎఫ్ ఖాతాదారులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్..! పెన్షన్‌ రూ.7.5 వేలకు పెంచే అవకాశం

EPFO కింద ఉన్న ప్రైవేట్ ఉద్యోగులు కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ గురించి జనవరి 10న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి EPS-95 కమిటీ వివరించింది. డీఏ, ఉచిత వైద్య సేవలు కల్పించాలని కూడా కోరారు. 2014లో కనీస పెన్షన్‌ను రూ.1,000గా నిర్ణయించినప్పటికీ, పెరిగిన ఖర్చులను అనుసరించి పెన్షన్ పెంపు కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాబోయే బడ్జెట్‌పై లక్షలాది పెన్షనర్లు ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌పై అనుకూల నిర్ణయం తీసుకుంటే, పెన్షనర్లకు ఆర్థిక భరోసా కలుగుతుందని అన్నారు.

ఈపీఎఫ్ ఖాతాదారులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్..! పెన్షన్‌ రూ.7.5 వేలకు పెంచే అవకాశం
Will Central Government Raise Pension
Follow us
Prashanthi V

|

Updated on: Jan 15, 2025 | 1:01 PM

ప్రస్తుత కాలంలో EPFO కింద పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులు తమ పెన్షన్‌ను పెంచాలనే డిమాండ్ ను వ్యక్తం చేశారు. జనవరి 10న ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని కనీస పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని మాత్రమే కాకుండా.. డీఏ, ఉచిత వైద్య సేవలు అందించాలని కూడా కోరారు.

ప్రస్తుత EPFO పెన్షన్

EPFO కింద ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న కనీస పెన్షన్ రూ.1,000 మాత్రమే. ఇది చాలా తక్కువగా ఉందని.. ఈ మొత్తం వారికి పెన్షన్ జీవితంలో సరిపడటం లేదని పెన్షనర్లు భావిస్తున్నారు. అందుకని EPS-95 (ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995) కింద ఉన్న పెన్షనర్లు గత 8 ఏళ్లుగా ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు.

2014లో తీసుకున్న నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం 2014లో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.1,000గా నిర్ణయించింది. అయితే ఆ సమయంలో పెన్షనర్లు దీనిని తాత్కాలికంగా అంగీకరించినప్పటికీ.. ప్రస్తుతం ఈ మొత్తం జీవన ఖర్చులకు సరిపడటం లేదని స్పష్టం చేస్తున్నారు. పెన్షనర్లు ఈ డిమాండ్‌తో పాటు, డీఏతో పాటు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని కూడా కోరుతున్నారు.

పెన్షనర్ల ప్రధాన డిమాండ్‌లు

EPS-95 నేషనల్ అగిటేషన్ కమిటీ ప్రతినిధులు ఆర్థిక మంత్రిని కలిసి తమ డిమాండ్‌లను ఆమె ముందు ఉంచారు. ఈ సమావేశంలో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.7,500కు పెంపు చేయడంతో పాటు, పెన్షనర్ల ఆరోగ్య సమస్యల కోసం మెరుగైన వైద్య సేవలు అందించాలనే అంశాలు చర్చకు వచ్చాయి. కమిటీ సభ్యులు దీన్ని అత్యవసరమైన నిర్ణయంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆర్థిక మంత్రితో చర్చ

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సమస్యకు సానుకూల పరిష్కారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారని అన్నారు. పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడినట్లు వెల్లడించారు.

రాబోయే బడ్జెట్‌పై పెన్షనర్ల ఆశలు

పెన్షనర్లు ఇప్పుడు రాబోయే బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌లో కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.7,500గా పెంచటమే కాకుండా.. డీఏను కూడా చేర్చాలని కోరుతున్నారు. ఇది నిర్ణయించబడితే లక్షలాది పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. పెన్షనర్లకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా వారి జీవితాన్ని మరింత సుఖంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలని పెన్షనర్ల సంఘం కోరింది.

కార్మిక సంఘాల డిమాండ్‌లు

పెన్షనర్ల సంఘంతో పాటు, ఇతర కార్మిక సంఘాలు కూడా బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రిని కలిశాయి. వారు కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.5,000కు పెంచాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇది EPS-95 నేషనల్ అగిటేషన్ కమిటీ ప్రతిపాదించిన రూ.7,500 కంటే తక్కువగానే ఉన్నా, ఈ నిర్ణయం తీసుకోవడం అత్యవసరమని వారు అన్నారు.

EPFO కనీస పెన్షన్ పెంపు అవసరం

ప్రస్తుతం పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను పరిశీలిస్తే.. కనీస పెన్షన్ పెంపు అనేది వారి జీవితంలో కీలకమైన మార్పుగా ఉంటుంది. పెన్షన్ మొత్తం పెరిగితే పెన్షనర్లు తమ ఆరోగ్య సంరక్షణ, ఆహార అవసరాలు, ఇతర అవసరాలకు సరిపడా ఖర్చు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.