AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్‌ కార్యాలయాలపై సెబీ దాడులు.. ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏమిటి?

Mutual Fund: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కార్యాలయాలతో సహా 16 సంస్థలపై దాడులు చేసింది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఇద్దరు..

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్‌ కార్యాలయాలపై సెబీ దాడులు.. ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏమిటి?
Follow us
Subhash Goud

|

Updated on: Jul 22, 2022 | 6:47 PM

Mutual Fund: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కార్యాలయాలతో సహా 16 సంస్థలపై దాడులు చేసింది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఇద్దరు ఫండ్ మేనేజర్‌లు అక్రమాలకు పాల్పడ్డారని కేసు నమోదైంది. ఈ ఫండ్ మేనేజర్లు ముందుండి అక్రమాలు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సెబీ దాడులకు పాల్పడింది. ఆ తర్వాత వారిని ఫండ్ హౌస్ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం సెబీ దీనిపై విచారణ జరుపుతోంది. ఫండ్ మేనేజర్లు వీరేన్ జోషి, దీపక్ అగర్వాల్‌ల ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపిన తర్వాత కంపెనీ సెబీకి నివేదికను సమర్పించింది. ఈ విషయం మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల నమ్మకాన్ని కదిలించింది. ఈ మొత్తం వ్యవహారం మరోసారి ప్రధాన వార్తల్లోకి ఎక్కింది. ఈ సంఘటన తర్వాత, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురయ్యారు. తమ డబ్బు పోతుందేమోనన్న భయాందోళన నెలకొంది.

ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏమిటి?

ఫ్రంట్ రన్నింగ్‌ను సెబీ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌గా పరిగణిస్తుంది. ఒక వ్యక్తి షేర్లను కొనుగోలు చేసినప్పుడు లేదా విక్రయించినప్పుడు, దానిని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారు. ఉదాహరణకు.. X కంపెనీకి పెద్ద ఆర్డర్ వచ్చిందనుకుందాం. ఎలాగోలా ఓ వ్యాపారికి ఈ విషయం తెలిసిన తర్వాత ఆ కంపెనీ షేర్లను కొంటాడు. సమయానికి, పెట్టుబడిదారులు ఆర్డర్ గురించి తెలుసుకుంటాడు. దాని షేర్ ధర అప్పటికే పెరిగి ఉంటుంది. ఆ వ్యాపారి ఇప్పుడు తన షేర్లను అమ్మడం ద్వారా లాభం పొందుతాడు.

ఇవి కూడా చదవండి

మ్యూచువల్ ఫండ్ పెద్ద ఆర్డర్ చేసినప్పుడల్లా ఫండ్ ఖాతా నుండి ఆర్డర్‌ను అమలు చేయడానికి ముందు కొంతమంది ఫండ్ మేనేజర్‌లు వారి వ్యక్తిగత ఖాతా నుండి అదే స్టాక్‌ను కొనుగోలు చేస్తారు. ఈ ఫండ్ హౌస్‌లు పెద్ద సంఖ్యలో స్టాక్‌ను కొనుగోలు చేసినప్పుడు దాని ధర పెరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను ఫ్రంట్-రన్నింగ్ అంటారు. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కేసు జనవరి 2022 నాటిది. కొంతమంది వ్యక్తులు జోషి అనుమానాస్పద కార్యకలాపాలపై కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇద్దరు డీలర్లు జోషి, దీపక్ అగర్వాల్‌లపై కంపెనీ అంతర్గత విచారణ చేపట్టింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి