కిలో టమాటా 100, వంకాయ 140.. సామాన్యుడి నడ్డి విరుస్తున్న కూరగాయల ధరలు

రుతుపవనాలు, భారీ వర్షాల కారణంగా రవాణాలో సమస్య తలెత్తి దేశంలో ద్రవ్యోల్బణం వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర రూ.80 దాటగా, బెండకాయ ధర రూ.100 దాటింది. మరోవైపు కోల్‌కతా మార్కెట్‌లో కూరగాయలు, కోడిగుడ్లు, కోడి మాంసం రిటైల్‌ ధరలు అధికంగా ఉండడంతో సామాన్యుల కష్టాలు బాగా పెరిగాయి. కోల్‌కతాలో కూరగాయల ధరలలో ఎంత పెరుగుదల కనిపించిందో తెలుసుకుందాం...

కిలో టమాటా 100, వంకాయ 140.. సామాన్యుడి నడ్డి విరుస్తున్న కూరగాయల ధరలు
Vegetables
Follow us

|

Updated on: Jul 09, 2024 | 10:32 AM

రుతుపవనాలు, భారీ వర్షాల కారణంగా రవాణాలో సమస్య తలెత్తి దేశంలో ద్రవ్యోల్బణం వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధర రూ.80 దాటగా, బెండకాయ ధర రూ.100 దాటింది. మరోవైపు కోల్‌కతా మార్కెట్‌లో కూరగాయలు, కోడిగుడ్లు, కోడి మాంసం రిటైల్‌ ధరలు అధికంగా ఉండడంతో సామాన్యుల కష్టాలు బాగా పెరిగాయి. కోల్‌కతాలో కూరగాయల ధరలలో ఎంత పెరుగుదల కనిపించిందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: ఆ పథకం డబ్బులు రాగానే లవర్స్‌తో పరారైన 11 మంది భార్యలు.. ఈ భర్తల కష్టం మరెవరికీ రాకూడదు

కోల్‌కతా నగరంలోని పలు మార్కెట్‌లలో కూరగాయల విక్రయదారులు మాట్లాడుతూ, టమాటా ధరలు నెల క్రితం రూ.45-50 నుండి కిలో రూ.80-100 వరకు పెరిగాయి. వంకాయలు కిలో రూ.110-140కి విక్రయిస్తున్నట్లు తెలిపారు. జూన్ ప్రారంభంలో ధరతో పోలిస్తే ఇది దాదాపు 150 శాతం పెరిగింది. కాకరకాయ, పచ్చిమిర్చి వంటి అనేక ఇతర కూరగాయల ధరలు కూడా సగటున 50 శాతం పెరిగాయి. స్థానిక మార్కెట్లలో కోడిగుడ్లు, కోడి మాంసం ధరలు 20-30 శాతం పెరిగాయి. పశ్చిమ బెంగాల్ వెండర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన ఒక మూలం మీడియాలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి టమోటాలు బెంగాల్‌కు వస్తున్నాయని చెప్పారు. వేడిగాలులు, భారీ వర్షాల కారణంగా బెంగళూరు, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి టమాటాల సరఫరా తగ్గింది. ఉత్పత్తి కూడా దెబ్బతినడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Mukesh Ambani: మరో కొత్త వ్యాపారంలోకి అంబానీ.. కొత్త ఓఎస్‌తో చౌకైన జియో స్మార్ట్‌టీవీలు

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎరువులు, రవాణా రాయితీల్లో సహాయం తగ్గించడంతో ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారని, వాతావరణ పరిస్థితులు కూడా పరిస్థితిని మరింత దిగజార్చాయని వ్యవసాయ మంత్రి శోభందేవ్ చటోపాధ్యాయ అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మన రైతులకు నిరంతరం సహాయం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఛటోపాధ్యాయ అన్నారు. ముడిసరుకు ధరలు పెరగడంతో రైతులు నష్టపోతున్నారు. మరోవైపు కేంద్రం రకరకాల సబ్సిడీలను కోత పెడుతోంది. దీంతో రైతులు, సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రిటైల్ పంపిణీ నెట్‌వర్క్ సుఫాల్ బంగ్లా ఉందని, వారి దుకాణాలలో కూరగాయలు, ఆహార పదార్థాలను సరసమైన ధరలకు విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి