AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: సక్సెస్‌ అంటే ఇది కదరా మామ.. లక్షల రూపాయల కొలువును వదిలి వ్యాపారం.. కోట్లల్లో టర్నోవర్‌

కొంత మంది నలుగురూ వెళ్లే దారిలో వెళ్లకుండా కొత్త తరహాలో వెళ్లి సక్సెస్‌ అవుదామనుకుంటారు. ఇందుకోసం కఠోర శ్రమ చేస్తారు. ఒక్కోసారి వాళ్లు తీసుకునే నిర్ణయాలు కఠినంగానే ఉంటాయి. ఈ తరహాకు చెందిన వ్యక్తే బౌసాహేబ్‌ నవాలే. చాలా మంది వ్యక్తులు తమ కెరీర్‌లో కష్టపడి పనిచేసి చివరికి రిటైర్‌మెంట్‌ను ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే భౌసాహెబ్ నవాలే సొంత తెలివితేటలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు.

Success Story: సక్సెస్‌ అంటే ఇది కదరా మామ.. లక్షల రూపాయల కొలువును వదిలి వ్యాపారం.. కోట్లల్లో టర్నోవర్‌
Bhausaheb Navale
Nikhil
| Edited By: |

Updated on: Nov 06, 2023 | 10:45 PM

Share

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కంటూ ఉంటారు. అయితే కొంత మంది నలుగురూ వెళ్లే దారిలో వెళ్లకుండా కొత్త తరహాలో వెళ్లి సక్సెస్‌ అవుదామనుకుంటారు. ఇందుకోసం కఠోర శ్రమ చేస్తారు. ఒక్కోసారి వాళ్లు తీసుకునే నిర్ణయాలు కఠినంగానే ఉంటాయి. ఈ తరహాకు చెందిన వ్యక్తే బౌసాహేబ్‌ నవాలే. చాలా మంది వ్యక్తులు తమ కెరీర్‌లో కష్టపడి పనిచేసి చివరికి రిటైర్‌మెంట్‌ను ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే భౌసాహెబ్ నవాలే సొంత తెలివితేటలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఏకంగా నెలకు రూ. 2.5 లక్షలు వచ్చే ఉద్యోగాన్ని మానేసి వ్యాపారం వైపు అడుగులు వేశాడు. వ్యాపారంలో సక్సెస్‌ అయిన బౌసాహేబ్‌ నవాలే ఏ వ్యాపారం చేశాడు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో? ఓ సారి తెలుసుకుందాం. 

మహారాష్ట్రలోని పూణేకు చెందిన భౌసాహెబ్ నవాలే తన సొంత నర్సరీ కంపెనీని స్థాపించాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భౌసాహెబ్ తన పదవికి రాజీనామా చేయాలని భావించారు, ఈ సమయంలో ప్రజలు ప్రతిచోటా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భౌసాహెబ్ నవాలే ఒక కొత్త కంపెనీని ప్రారంభించాడు. ఆ సమయంలో అతనికి నెలకు రూ. 2.5 లక్షలు జీతం అంటే ఏటా రూ. 30 లక్షలు వచ్చే లాభదాయకమైన ఉద్యోగం ఉంది. అయినా దాన్ని మానేసి నర్సరీ వ్యాపారాన్ని పెట్టాడు. ఆ తర్వాత కోట్లాది రూపాయల కంపెనీగా ఎదిగింది. అతను నర్సరీ వ్యాపారాన్ని స్థాపించడానికి భారతదేశానికి తిరిగి రావడానికి ముందు భౌసాహెబ్ నవాలే విదేశాల్లో ఉద్యోగం చేసేవాడు.

బౌసాహేబ్‌ నవాలలే భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని మావల్ తాలూకాలో గ్రీన్ అండ్ బ్లూమ్స్ నర్సరీని స్థాపించాడు. బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివిన భౌసాహెబ్ నవాలే చాలా మందికి పని దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో ఇండోర్ పాట్ ప్లాంట్ నర్సరీని ప్రారంభించారు. ప్రస్తుతం 27 యూనిట్లతో ఒక్కో యూనిట్‌ ఎకరం స్థలంలో ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా మొక్కలను రవాణా చేస్తున్నారు. భౌసాహెబ్ స్థాపించిన ఈ నర్సరీలో వంద రకాల మొక్కలు పెంచుతున్నారు. అలాగే ఆ మొక్కలను దేశంలోని 300 పెద్ద, చిన్న నర్సరీలకు విక్రయిస్తారు.

ఇవి కూడా చదవండి

అయితే భౌసాహెబ్‌కు ఇథియోపియాలోని పాలీహౌస్‌లలో పదేళ్లపాటు గులాబీలను పెంచే నర్సరీలో పని చేశాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ 1995 నుంచి 2020 వరకు నెలకు రూ. 2.5 లక్షల జీతం అందుకునే స్థాయికు వచ్చాడు. ఆ సమయంలో అతనికి అన్ని సౌకర్యాలను కంపెనీ అందుబాటులో ఉంచి అతను దాదాపు 25 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తరువాత అతను స్వదేశానికి వచ్చి ఇక్కడ నర్సరీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి