AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

May New Rules: అలర్ట్.. ఈ నెలలో మారిన కొత్త రూల్స్ ఇవే.. ఏంటో తెలుసుకోండి..

కొత్త నెల వచ్చేసింది.. మే నెలలో దేశంలోని అనేక అంశాల్లో మార్పులు జరగనున్నాయి. ఇందులో చాలా వరకు సాధారణ ప్రజలకు కూడా వర్తిస్తాయి.

May New Rules: అలర్ట్.. ఈ నెలలో మారిన కొత్త రూల్స్ ఇవే..  ఏంటో తెలుసుకోండి..
New Rules
Rajitha Chanti
|

Updated on: May 02, 2022 | 12:59 PM

Share

కొత్త నెల వచ్చేసింది.. మే నెలలో దేశంలోని అనేక అంశాల్లో మార్పులు జరగనున్నాయి. ఇందులో చాలా వరకు సాధారణ ప్రజలకు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఈ నెలలో జరిగే మార్పులు.. కొత్త రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకుల సెలవులు.. బ్యాంక్ ఖాతాల వివరాలు.. ఇన్సూరెన్స్ పాలసీలు.. సిలిండర్ ధరలు ఇలా ప్రతి విషయాల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. మరీ కొత్తగా వచ్చే రూల్స్ ఎంటో తెలుసుకుందామా.

యాక్సిస్ బ్యాంకులో పొదుపు ఖాతాలలో అనేక మార్పులు జరిగాయి. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం నుంచి నిర్ధేశించిన దానికంటే ఎక్కువ డబ్బు విత్ డ్రా చేసుకుంటే.. గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. బ్యాంక్ తన సేవలకు ఛార్జీలు కూడా పెంచింది. వాస్తవానికి మే 1 నుంచి బ్యాంకు ఖాతాల్లో ఉండే కనీస మొత్తాన్ని పెంచగా.. ఇప్పుడు ఖాతాలో ఉంచాల్సిన మొత్తాన్ని రూ. 10,000 నుంచి రూ. 15.000కు పెంచింది.

కరోనా సెకండ్ వేవ్ మధ్య.. IRDA ఆరోగ్య సంజీవని బీమా పాలసీలో కవర్ చేయాల్సిన మొత్తాన్ని రెండు రెట్లు పెంచింది. ఇప్పుడు మే నుంచి భీమా కంపెనీలు రూ. 10 లక్షల వరకు కవర్ మొత్తాన్ని అందిస్తాయి ఇంతకు ముందు, ఏప్రిల్ 1, 2020 నుండి ప్రారంభమైన ఈ బీమా పాలసీ ద్వారా మీరు రూ. 5 లక్షల వరకు కవరేజీని పొందేవారు.

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తాయి. మే 1వ తేదీన కొత్త గ్యాస్ ధరలను నిర్ణయిస్తారు. మే నుండి గ్యాస్ సిలిండర్ల ధర మారుతుంది.

మే నెలలో బ్యాంకులు 12 రోజులు బంద్ కానున్నాయి. ఆర్బీఐ వెబ్ సైట్ లో విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. ఇక రాష్ట్రాల వారిగా బ్యాంకులకు సెలవులు కేటాయించనున్నాయి. ఈ మే నెలలో దాదాపు12 రోజులు బ్యాంకులు పనిచేయవు.

మీరు రిటైల్ ఇన్వెస్టర్ అయితే కంపెనీ IPOలో పెట్టుబడి పెట్టడానికి UPI ద్వారా చెల్లింపు చేస్తే SEBI ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు మీరు రూ. 5 లక్షల వరకు బిడ్‌ను సమర్పించవచ్చు. ఇప్పటి వరకు పరిమితిని రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పుడు, ఈ కొత్త చెల్లింపు పరిమితి మే 1 తర్వాత వచ్చే IPOలో వర్తిస్తుంది.

ఈ మే నెలలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కోవిడ్ టీకాలు తప్పనిసరిగా వేయాలి. మారిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ టీకాలు వేయించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Actor Vijay Babu: అమ్మ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తప్పుకున్న హీరో.. ఎందుకంటే..

Keerthy Suresh: సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నాను.. ఆసక్తికర పోస్ట్ చేసిన కీర్తి సురేష్..

RC 15: డైరెక్టర్ శంకర్ భారీ ప్లాన్.. చరణ్ సినిమాలో హైలేట్ అవే.. కొత్త షెడ్యూల్ అప్పుడే స్టార్ట్..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో మహేష్‏కు ఆ సాంగ్ ఇష్టం.. రచయత అనంత్ శ్రీరామ్..