Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks : కరోనా సమయంలో లాభాలు ఆర్జించిన బ్యాంకులు ఇవే..! ఎస్బీఐ నుంచి మొదలుపెడితే చాలా బ్యాంకులు..?

These Banks : కరోనా వల్ల దేశంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. దేశ జిడిపి

Banks : కరోనా సమయంలో లాభాలు ఆర్జించిన బ్యాంకులు ఇవే..! ఎస్బీఐ నుంచి మొదలుపెడితే చాలా బ్యాంకులు..?
These Banks
Follow us
uppula Raju

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 26, 2021 | 5:13 PM

కరోనా వల్ల దేశంలో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింది. దేశ జిడిపి పడిపోయింది. ఈ సమయంలో కూడా దేశంలోని బ్యాంకింగ్ రంగం లాభసాటిగానే ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ప్రైవేట్ బ్యాంకుల వరకు భారీ లాభాలు ఆర్జించాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం రికార్డు స్థాయిలో 1,02,252 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. అయితే అంతకు ముందు అంటే 2019 ఆర్థిక సంవత్సరంలో మాత్రం 5000 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.

లాభం గురించి చెప్పాలంటే దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం 31,116 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది మొత్తం బ్యాంకింగ్ రంగంలో 30 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బిఐ కూడా ఈ కాలంలో చాలా సంపాదించింది. కరోనా కాలంలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వాటా రూ .20,410 కోట్లుగా ఉంది. ఇది మొత్తం లాభంలో 20 శాతం. మరోవైపు ఐసిఐసిఐ (ICICI Bank) లాభం రూ.16,192 కోట్లు. ఇది మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు. వాస్తవానికి బ్యాంకుల లాభాలకు అతి పెద్ద కారణం.. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకులు రుణాల వేగాన్ని పెంచాయి. ముఖ్యంగా కరోనా కాలంలో రుణాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు చురుకుగా పనిచేశాయి.

బ్యాంకింగ్ రంగం మొత్తం లాభంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా కూడా బలంగా ఉంది. ఈ కాలంలో దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2 మాత్రమే నష్టపోతున్నాయని అంచనా వేయవచ్చు. బ్యాంకుల లాభాలకు ఒక ప్రధాన కారణం ఏమిటంటే ఈ కాలంలో పెద్ద బ్యాంకులు చాలా రుణాల సమస్య నుంచి బయటకు వచ్చాయి. మరోవైపు మార్చి త్రైమాసిక ఫలితాల గురించి మాట్లాడితే దేశంలోని 3 అతిపెద్ద బ్యాంకుల పనితీరు అద్భుతంగా ఉంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బిఐ 80 శాతం లాభాలను ఆర్జించింది. అదే సమయంలో దేశంలోని రెండు పెద్ద ప్రైవేట్ బ్యాంకుల వృద్ధి కూడా అద్భుతమైనది. ఇవే కాకుండా విలీనాల ద్వారా బ్యాంకుల స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

CM KCR: ప‌ల్లె ప్ర‌గ‌తి, పట్టణ ప్రగతికి భారీగా నిధుల కేటాయింపు.. జిల్లాకు కోటి చొప్పున మంజూరు..

Schools Reopen: జూలై 1 నుంచి తెలంగాణ‌లో పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభంకానున్నాయా.? అస‌లేం జ‌ర‌గ‌నుంది?

Viral Video: బామ్మ రాక్స్.. మనమడు షాక్.. మరీ ఇంత చీటింగ్ అయితే ఎలా బామ్మా!.. ఫన్నీ వీడియో మీకోసం..