AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పురుషుల కోసం ప్రత్యేక బస్సులు.. కట్‌ చేస్తే.. వారంలోనే నిలిపివేత.. ఎందుకంటే

ఈ బస్సుకు పురుషులకు మాత్రమే అనే బోర్డును తగిలించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయంటూ పురుషులు తెగ సంబరపడిపోతున్నారు. పురుషుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బస్సు వారం గడవకముందే పురుషులను నిరుత్సాహపరిచింది. వారంలో రెండు రోజులు మాత్రమే ఈ బస్సును నడిపిన ఆర్టీసీ.. రద్దు చేసేసింది..

Hyderabad: పురుషుల కోసం ప్రత్యేక బస్సులు.. కట్‌ చేస్తే.. వారంలోనే నిలిపివేత.. ఎందుకంటే
Tsrtc
Subhash Goud
|

Updated on: Feb 05, 2024 | 11:27 AM

Share

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్న విషయం తెలిసిందే. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిననాటి నుంచి రోజుకో రచ్చ జరుగుతోంది. ప్రతి బస్సులో మహిళలే ఉండటంతో పురుషుల ప్రయాణానికి ఇబ్బందిగా మారుతోంది. ఏ బస్సులో చూసినా సీట్లన్ని మహిళలతోనే దర్శనమిస్తుండటంతో మగవారు నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. అంతేకాదు మహిళలు సైతం ఒకరిపై ఒకరు ఘర్షణలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పురుషుల కోసం ప్రత్యేక బస్సు కావాలని డిమాండ్‌ పెరుగుతుండటంతో ఆర్టీసీ స్పందించింది. పురుషుల కోసం ప్రయోగాత్మకంగా ఓ బస్సును ఏర్పాటు చేసింది. అది కూడా హైదరాబాద్‌లోని రూట్‌ నంబర్‌ 277లో ఎల్‌బీనగర్‌ – ఇబ్రాహీంపట్నం వరకు పురుషుల కోసం ఓ ప్రత్యేక బస్సును అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ బస్సుకు పురుషులకు మాత్రమే అనే బోర్డును తగిలించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయంటూ పురుషులు తెగ సంబరపడిపోతున్నారు. పురుషుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బస్సు వారం గడవకముందే పురుషులను నిరుత్సాహపరిచింది. వారంలో రెండు రోజులు మాత్రమే ఈ బస్సును నడిపిన ఆర్టీసీ.. రద్దు చేసేసింది. ఈ అందుకు కారణం లేకపోలేదు. పరుషుల కోసం నడిపిన ఈ బస్సుకు పెద్దగా ఆదరణ లేకపోవడం వల్లే ఈ బస్సును నిలిపివేసినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

పురుషుల కోసం కేటాయించిన ఈ బస్సు కోసం ఎదురు చూడకుండా ముందుగా వచ్చిన బస్సులోనే ఎక్కి వెళ్తున్నారని, ఈ ప్రత్యేక బస్సులో పెద్దగా ఎవ్వరు కూడా ఎక్కడ లేదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పురుషుల కోసం కేటాయించిన ఈ బస్సుకు ఆదరణ అంతగా లేదు అని ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఒక అధికారి ధృవీకరించారు. విద్యార్థులు సైతం ముందు వచ్చిన బస్సులోనే వెళ్తున్నారని చెబుతున్నారు. అయితే మహిళలు ఉచిత ప్రయాణం కల్పించగా, మగ విద్యార్థుల కోసం సిటీ ఆర్డినరీ బస్సులను ఉచితంగా అందించాలని ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి చెప్పాడు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నంలోని కాలేజీల క్లస్టర్లకు 85 ట్రిప్పులను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?