AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tax Collection: పన్ను ఎగవేత కేసులు తగ్గుముఖం పట్టాయి.. కీలక విషయాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

తగిన వ్యవస్థ కారణంగానే గత కొన్నేళ్లుగా పన్నుల వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పన్ను రేటును పెంచలేదు. అయితే పన్ను ఆదాయం మాత్రం పెరిగింది. పన్నుల వసూళ్ల వ్యవస్థ..

Tax Collection: పన్ను ఎగవేత కేసులు తగ్గుముఖం పట్టాయి.. కీలక విషయాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman
Subhash Goud
|

Updated on: Jul 25, 2023 | 5:44 PM

Share

తగిన వ్యవస్థ కారణంగానే గత కొన్నేళ్లుగా పన్నుల వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పన్ను రేటును పెంచలేదు. అయితే పన్ను ఆదాయం మాత్రం పెరిగింది. పన్నుల వసూళ్ల వ్యవస్థ సమర్థత వల్ల అధిక పన్ను వసూళ్లు సాధ్యమైందని మంత్రి తెలిపారు. పన్నుల వ్యవస్థలో టెక్నాలజీ మార్పు తీసుకొచ్చిందని అన్నారు.

చాలా సమస్యలకు టెక్నాలజీయే సమాధానం అని ప్రధాని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో పన్ను ఎగవేత కేసులు తగ్గుముఖం పట్టాయి. టెక్నాలజీ వల్ల ఆదాయపు పన్ను మదింపులో సానుకూల మార్పు సాధ్యమైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అత్యంత పారదర్శకమైన, వినియోగదారులకు అనుకూలమైన ఆదాయపు పన్ను వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి, ఈ ఏడాది నోటిఫై చేసిన లక్ష మంది పన్ను చెల్లింపుదారుల అంచనాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

రూ.50 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. తాజాగా నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిపై స్పష్టత ఇస్తూ రూ.7.27 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పారు. అధికారికంగా పన్ను మినహాయింపు పరిమితి రూ.7 లక్షల వరకు మాత్రమే. అయితే ఆదాయం కాస్త పెరిగితే పన్ను చెల్లించవచ్చా లేదా అనే గందరగోళం నేపథ్యంలో మినహాయింపు పరిమితిని అదనంగా రూ.27,000కు పెంచారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి