Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. సిప్, లంప్సమ్‌లో ఏది బెటర్..

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. సిప్, లంప్సమ్‌లో ఏది బెటర్..
Mutual Fund
Follow us

|

Updated on: Mar 18, 2022 | 6:58 PM

ప్రస్తుతం స్టాక్ మార్కెట్(Stock Market) సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకమొత్తంలో(lumpsum) ఇన్వెస్ట్ చేయాలా లేక సిప్(SIP) సాయంతో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా అనే ప్రశ్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల మదిలో మెదులుతోంది. పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉంటే, పెట్టుబడిదారులు దానిని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి. స్మార్ట్ ఇన్వెస్టర్లు క్రమంగా మిగులు నిధులను దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారని నిపుణులు అంటున్నారు. ఇది కాకుండా.. పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితంగా ఉంచాలని కూడా పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ చింతన్ హరియా తెలిపారు. అటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారులు ప్రత్యేక 12-18 నెలల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలి. ఇది గొప్ప పెట్టుబడి అవకాశం. భారత ఆర్థిక వ్యవస్థ, భారత స్టాక్ మార్కెట్ పనితీరు దీర్ఘకాలికంగా బలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ మీ వద్ద మిగులు నిధులు ఉంటే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. మీకు ఇష్టమైన ఉత్పత్తి ఎప్పుడు తగ్గింపుతో లభిస్తుందో, అప్పుడు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయకూడదని వారు అంటున్నారు. వచ్చే 6-12 నెలల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.

ట్రాన్సెండ్ క్యాపిటల్ డైరెక్టర్ కార్తీక్ ఝవేది మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా మార్కెట్ ఎప్పుడు అమ్మకాలను చూసినా, వచ్చే 2-3 నెలల్లో కోలుకుంటుంది. ఒక పెట్టుబడిదారుడు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఇప్పుడు మిగులులో 25 శాతం పెట్టుబడి పెట్టాలన్నారు. మిగిలిన సొమ్మును పెట్టుబడి పెట్టడానికి 3-4 వారాలు వేచి ఉండాలన్నారు. ఇంకా క్షీణత ఉంటే మరో 25 శాతం పెట్టుబడి పెట్టాలని. ప్రస్తుత స్థాయి కంటే 5 శాతం మెరుగుదల ఉన్నా 25 శాతం పెట్టుబడి పెట్టాలని సూచించారు. అయితే చాలా మంది నిపుణులు మ్యూచువల్ ఫండ్లలో SIP పెట్టుబడి పెట్టడానికి తెలివైన మార్గం అని అంగీకరిస్తున్నారు. వారు మార్కెట్ అస్థిరతపై ఎక్కువగా దృష్టి పెట్టకూడదని క్రమశిక్షణతో SIP లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

Read Also.. Income Tax: రికార్డు స్థాయిలో పెరిగిన పన్ను వసూళ్లు.. గతేడాది కంటే 48.41% ఎక్కువ..