AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: గుడ్‌ న్యూస్‌.. తెలంగాణకు మరో వందే భారత్‌ రైలు.. పూర్తి వివరాలు ఇవే..

భారతీయ రైల్వే రూపురేఖలు మార్చేసిన వందే భారత్‌ రైళ్లకు ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ...

Vande Bharat Express: గుడ్‌ న్యూస్‌.. తెలంగాణకు మరో వందే భారత్‌ రైలు.. పూర్తి వివరాలు ఇవే..
Vande Bharat
Narender Vaitla
|

Updated on: Feb 28, 2023 | 4:06 PM

Share

భారతీయ రైల్వే రూపురేఖలు మార్చేసిన వందే భారత్‌ రైళ్లకు ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ వందే భారత్‌ రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలకు ఇప్పటికే ఒక రైలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందిస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య మరో వందే భారత్‌ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్‌ సేవలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-పూణె రూట్‌లో వందే భారత్ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్‌-పుణెల మధ్య ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును భారతీయ రైల్వే వందే భారత్ రైలుతో రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌-పుణె మార్గంలో రైలు పరుగులు తీయనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వందే భారత్ రైళ్లతో రీప్లేస్ చేసే ఆలోచనలో ఇండియన్‌ రైల్వే ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఏప్రిల్‌ నాటికి ఈ రైలును పట్టాలెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో సికింద్రాబాద్‌ నుంచి మొత్తం మూడు మార్గాల్లో వందే భారత్‌ పరుగులు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో వందే భారత్‌ పరుగులు పెట్టనునన్నట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..