AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: గుడ్‌ న్యూస్‌.. తెలంగాణకు మరో వందే భారత్‌ రైలు.. పూర్తి వివరాలు ఇవే..

భారతీయ రైల్వే రూపురేఖలు మార్చేసిన వందే భారత్‌ రైళ్లకు ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ...

Vande Bharat Express: గుడ్‌ న్యూస్‌.. తెలంగాణకు మరో వందే భారత్‌ రైలు.. పూర్తి వివరాలు ఇవే..
Vande Bharat
Narender Vaitla
|

Updated on: Feb 28, 2023 | 4:06 PM

Share

భారతీయ రైల్వే రూపురేఖలు మార్చేసిన వందే భారత్‌ రైళ్లకు ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ వందే భారత్‌ రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలకు ఇప్పటికే ఒక రైలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందిస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య మరో వందే భారత్‌ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్‌ సేవలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-పూణె రూట్‌లో వందే భారత్ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్‌-పుణెల మధ్య ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును భారతీయ రైల్వే వందే భారత్ రైలుతో రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌-పుణె మార్గంలో రైలు పరుగులు తీయనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వందే భారత్ రైళ్లతో రీప్లేస్ చేసే ఆలోచనలో ఇండియన్‌ రైల్వే ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఏప్రిల్‌ నాటికి ఈ రైలును పట్టాలెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో సికింద్రాబాద్‌ నుంచి మొత్తం మూడు మార్గాల్లో వందే భారత్‌ పరుగులు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో వందే భారత్‌ పరుగులు పెట్టనునన్నట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..