AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India’s Richest Woman: భారతదేశంలోని అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరో తెలుసా..?

ప్రపంచ ధనవంతుల జాబితాలో పురుషుల కంటే మహిళలు తక్కువేమీ కాదు. అమెరికా, జర్మనీ, ఇటలీ, భారత్‌తో సహా ఇతర దేశాలకు చెందిన మహిళలు బిలియనీర్ల జాబితాలో చేరారు. అమెరికాలో 92 మంది బిలియనీర్ మహిళలు మాత్రమే ఉండగా, చైనాలో 46, జర్మనీలో 36, ఇటలీలో 16, భారతదేశంలో..

India's Richest Woman: భారతదేశంలోని అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరో తెలుసా..?
India's Richest Woman
Subhash Goud
|

Updated on: Mar 26, 2023 | 7:11 PM

Share

ప్రపంచ ధనవంతుల జాబితాలో పురుషుల కంటే మహిళలు తక్కువేమీ కాదు. అమెరికా, జర్మనీ, ఇటలీ, భారత్‌తో సహా ఇతర దేశాలకు చెందిన మహిళలు బిలియనీర్ల జాబితాలో చేరారు. అమెరికాలో 92 మంది బిలియనీర్ మహిళలు మాత్రమే ఉండగా, చైనాలో 46, జర్మనీలో 36, ఇటలీలో 16, భారతదేశంలో 9 మంది ఈ జాబితాలో ఉన్నారు. అయితే భారతదేశంలో అత్యంత ధనవంతులైన మహిళలు ఎవరో తెలుసా? వారు ఏమి చేస్తారో తెలుసా? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.

చాలా సంవత్సరాలుగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న భారతదేశపు అత్యంత సంపన్న మహిళ గురించి ఇక్కడ చెప్పబోతున్నాము. అయితే అంతకు ముందు ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళ గురించి చెప్పుకుందాం. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళ ఫ్రాన్స్‌కు చెందిన లోరియల్ కంపెనీ యజమాని ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్.

ఈ మహిళకు ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ సంపద:

ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్‌కు $ 85.9 బిలియన్ల ఆస్తులు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. అతని మొత్తం సంపద 78.8 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం భారతదేశం, ఆసియాలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో అత్యంత సంపన్న మహిళ ఎవరు?

ముఖేష్ అంబానీ తర్వాత భారతదేశంలో అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ. మరోవైపు, మహిళల గురించి మాట్లాడినట్లయితే, భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్. సావిత్రి జిందాల్ ఓపీ జిందాల్ భార్య. 2005లో హెలికాప్టర్ ప్రమాదంలో ఓపీ జిందాల్ మరణించిన తర్వాత, అతని భార్య వ్యాపారాన్ని చేపట్టింది. సావిత్రి జిందాల్ తన పెద్ద కొడుకు వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. ఆమె చిన్న కొడుకు పేరు నవీన్ జిందాల్.

నికర విలువ ఎంత

ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. సావిత్రి జిందాల్, ఆమె కుటుంబం నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు (రూ. 13,504 కోట్లు). ప్రపంచ సంపన్నుల జాబితాలో 101వ స్థానంలో ఉన్నారు. కంపెనీ స్టీల్, విద్యుత్, మౌలిక సదుపాయాలు, సిమెంట్ వ్యాపారం చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి