AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంపై ఎంత ప్రభావం చూపిందో తెలుసా?

రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తోంది.

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంపై ఎంత ప్రభావం చూపిందో తెలుసా?
Real Estate
Balaraju Goud
|

Updated on: Mar 13, 2022 | 8:37 AM

Share

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(World Economy)ను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం దీనికి మినహాయింపు కాలేకపోయింది. యుద్ధం కారణంగా మారిన పరిస్థితులు రియల్ ఎస్టేట్ రంగం(Indian Real Estate) పట్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను గణనీయంగా తగ్గించాయి. ఈ యుద్ధం కారణంగా, అంతర్జాతీయ ముడి చమురు(Crude Oil) ధరలలో విపరీతమైన పెరుగుదల నమోదు చేసుకుంది. మరోవైపు సంక్షోభం మధ్య ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుందనే భయం కూడా తీవ్రమైంది. ఈ పరిస్థితులన్నీ పెట్టుబడి సెంటిమెంట్‌కు ప్రతికూలంగా మారుతున్నాయి.

ముడి చమురు ధరలు పదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీని కారణంగా డెవలపర్లు లాభాల స్థాయిని కొనసాగించడానికి తమ ప్రాపర్టీ ధరలను తగ్గించుకంటున్నారు. ఉక్కు, సిమెంట్‌తో పాటు కూలీల ఖర్చు కూడా పెరిగిందని, ఈ పెరుగుదల గత రెండేళ్లుగా నిరంతరంగా కనిపిస్తోంది. ప్రస్తుత గ్లోబల్ దృష్టాంతం ద్రవ్యోల్బణాన్ని పెంచడానికి కట్టుబడి ఉంది. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఏప్రిల్‌లో జరిగే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

రియల్ ఎస్టేట్ రంగంలో పెరిగిన రవాణా వ్యయం కేవలం రెండు వారాల్లోనే బ్రెంట్ క్రూడ్ ధరలు 29 శాతం పెరిగాయని రియల్టీ కన్సల్టెంట్ అంటున్నారు. ముడి చమురు ధరలు నిరంతరంగా పెరగడం వల్ల దేశీయంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రవాణా వ్యయం పెరగడంతో పాటు నిర్మాణ రంగానికి అయ్యే మొత్తం వ్యయంలో రవాణా వాటా 20 శాతం. ఇది కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత ముఖ్యమైన ముడిసరుకు ఉక్కు అని, ఒక్క వారంలోనే వీటి ధర 17 శాతం పెరిగింది. అదే విధంగా సిమెంట్ ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా నిర్మాణలు ఎక్కువగా జరుగుతున్న ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో ధరలు భారీగా పెరిగాయి. సిమెంట్ కంపెనీలు 50 కిలోల బస్తాల ధరను రూ.5 నుండి 12 వరకు పెంచాయి. ముడిసరుకు ధరల పెరుగుదల నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపుతుంది.

యుద్ధం ప్రారంభానికి ముందు, కరోనా మహమ్మారి ఆధిపత్యం కొనసాగినప్పుడు, ముడి పదార్థాల ధరలు ఇలా ఉన్నాయి. ఉక్కు, సిమెంట్ మొదలైనవి ఒత్తిడిలో ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అల్యూమినియం, స్టీల్, టిఎమ్‌టి బార్‌ల ధరలు దాదాపు 25 30 శాతం పెరిగాయి. ఇది డెవలపర్‌లకు ధరను మాత్రమే పెంచింది. చివరికి ఇది మొత్తం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రానున్న రోజుల్లో పెట్రో ధరలు రెండంకెల పెరిగే అవకాశం ఉందని, దీంతో ఆర్‌బీఐ వడ్డీ రేటును పెంచాలని ఒత్తిడి పెరుగుతుంది. దీంతో గృహ రుణంపై వడ్డీ రేటు పెరిగి గృహ కొనుగోలుదారులకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు సంబంధించి చూస్తే స్టాక్ మార్కెట్ తీవ్ర క్షీణతలో కొట్టుమిట్టాడుతోంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విక్రయించడానికి బదులుగా ఉంచుతున్నారు. వారు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

అయితే, రియాల్టీ అడ్వైజరీ సంస్థ ప్రతినిధుల అభిప్రాయం ప్రకారం, స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న గందరగోళం నుండి రియల్టీ రంగం లాభపడనుంది. రియల్ ఎస్టేట్ రంగం తక్కువ లిక్విడిటీని కలిగి ఉంది. అందుకే అనిశ్చితి సమయాల్లో పెట్టుబడిదారులు ఈ రంగానికి తరలివస్తారు. ఇవే కాకుండా రియల్టీ రంగంలో ఇప్పటికీ తక్కువ ధరలు ఉండడం, ప్రజల ఆర్థిక సామర్థ్యం అత్యధిక స్థాయిలో ఉండడం వల్ల రియల్టీ రంగానికి మేలు జరుగుతుంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగానికి మెరుగైనదని నిరూపించడం జరిగింది. రెసిడెన్షియల్ రియల్టర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రూ. 34,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించారు. ఇది మొత్తం 2021 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన ఆస్తికి సమానం. క్రిసిల్ ప్రకారం, కరోనా మహమ్మారి సమయంలో ఇంటి నుండి పని చేసే ధోరణి పెరిగింది. పెద్ద ఇళ్ల ధోరణి పెరిగింది. ఇది రియల్టీ రంగానికి ప్రయోజనం చేకూర్చిందంటున్నారు.

Read Also… 

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు.. ఇప్పటివరకు ఎంతమంది పౌరులు చనిపోయారో తెలుసా?