Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు.. ఇప్పటివరకు ఎంతమంది పౌరులు చనిపోయారో తెలుసా?

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వందలాది మంది పౌరులు మరణించారు. 579 మంది పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (UNHCHR) తెలిపింది.

Russia Ukraine War: రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర పోరు.. ఇప్పటివరకు ఎంతమంది పౌరులు చనిపోయారో తెలుసా?
Russia Ukraine War
Follow us

|

Updated on: Mar 13, 2022 | 7:52 AM

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి వందలాది మంది పౌరులు మరణించారు. 579 మంది పౌరులు(Civilians) మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (UNHCHR) తెలిపింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 579 మంది పౌరులు మరణించారని,1,000 మందికి పైగా గాయపడ్డారని UNHCHR తెలిపింది. మరణించిన వారిలో 42 మంది చిన్నారులు కూడా ఉన్నారని UNHCHR శనివారం తెలిపింది. యుద్దంలో ప్రాణాలను కోల్పోయిన వారి వివరాలను జెనీవా(Geneva)లోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నమోదు చేసింది. ఇప్పటివరకు 564 మంది పౌరుల మరణించారని, 982 మంది గాయపడ్డారని తెలిపింది. పేలుడు ఆయుధాల వాడకం వల్లనే ఎక్కువ మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అసలు మృతుల సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని విశ్వసిస్తున్నట్లు UN అధికారులు తెలిపారు.

అయితే, రష్యా దాడి ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 1,300 మంది ఉక్రేనియన్ సైనికులు పోరాటంలో మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ శనివారం తెలిపారు. ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకోవాలంటే రష్యా నివాస ప్రాంతాలతో సహా పౌరులను బాంబు దాడి చేసి చంపేసినట్లు జెలెన్‌స్కీ మీడియా సమావేశంలో చెప్పారు. రష్యా దాష్టిక చర్య వల్ల సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, రష్యా ఇప్పటి వరకు దాదాపు 810 క్షిపణులను ప్రయోగించిందని గతంలో అమెరికా పేర్కొంది. రష్యా విమానాలు, ఫిరంగిదళాలు ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను లక్ష్యంగా చేసుకోగా, బాంబులు మరియు షెల్‌లు తూర్పున ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రాన్ని తాకాయి. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు ఇప్పటికే నియంత్రణలో ఉన్న నగరాలపై దాడి చేస్తూనే ఉన్నాయి. ప్రజలు అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారిని పాతిపెట్టకుండా నిరోధించారు. US రక్షణ అధికారులు రష్యా వైమానిక దాడులపై కీలక అననుమానం వ్యక్తం చేశారు. రష్యా పైలట్లు ఈ దాడి కోసం రోజుకు సగటున 200 మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు.

Read Also….

UKRAINE-RUSSIA WAR: మరింత తీవ్రంగా రష్యా, యుక్రెయిన్ యుద్దం.. ఆ లక్ష్యం నెరవేరితేనే పుతిన్ ఆగేది..!

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..