AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Guidelines: రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. పెద్ద ఉపశమనం

2000 రూపాయల నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత, వాటిని బ్యాంకుల్లో మార్చవలసి ఉంటుంది. ఐడీ కార్డు, ఫారం నింపి బ్యాంకుల్లో రూ.2000 విలువైన 10 నోట్లను మార్చుకోవచ్చని గతంలో గుర్తించారు. ఇప్పుడు..

SBI Guidelines: రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. పెద్ద ఉపశమనం
2000 Rupes Notes
Subhash Goud
|

Updated on: May 21, 2023 | 5:38 PM

Share

2000 రూపాయల నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత, వాటిని బ్యాంకుల్లో మార్చవలసి ఉంటుంది. ఐడీ కార్డు, ఫారం నింపి బ్యాంకుల్లో రూ.2000 విలువైన 10 నోట్లను మార్చుకోవచ్చని గతంలో గుర్తించారు. ఇప్పుడు దీని అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. 2000 విలువ కలిగిన నోటును ఫారమ్, ఐడీ కార్డ్ లేకుండా ఎస్‌బీఐ ఏ బ్రాంచ్‌లోనైనా మార్చవచ్చు.

కరెన్సీ నోట్లను మార్చుతారనే పుకార్లు, తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రకటన వచ్చింది. సొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే ఐడీ కార్డు ఇచ్చి ఫారమ్‌ నింపాలని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి ఆధార్ అవసరం లేదని, ఎలాంటి ఫారమ్ నింపాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

మే 23 నుంచి కరెన్సీ నోట్ల మార్పు ప్రక్రియ ప్రారంభం

2000 రూపాయల కరెన్సీ నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. 2000 కరెన్సీ నోట్లను నిషేధించలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే రిజర్వ్ బ్యాంక్ మాత్రం నోట్లను మార్చుకోవడానికి కాలపరిమితిని ఖరారు చేసింది. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లు బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయి. మే 23 నుంచి నోట్ల మార్పు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఈ నోట్లను యథాతథంగా ఉపయోగించడం కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

2000 కరెన్సీ నోట్ల చెలామణిలో తగ్గుదల

నవంబర్ 2016లో నోట్ల రద్దు తర్వాత రూ.2000 విలువ కలిగిన కరెన్సీ నోట్లు విడుదలయ్యాయి. నివేదిక ప్రకారం, మార్చి 2017 వరకు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లన్నీ విడుదలయ్యాయి. అయితే, తర్వాత దాని ముద్రణ క్రమంగా ఆగిపోయింది. మార్చి 31, 2018 నాటికి 2000 నోట్ల చలామణి 37 శాతం తగ్గింది. మార్చి 2023 నాటికి రూ.3.62 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి. నిజానికి ఈ నోట్లను కేవలం నాలుగు-ఐదేళ్లకు మాత్రమే జారీ చేశారన్నారు. ఇప్పుడు ఈ నోట్లను ఉపసంహరించుకోవాలని ఆర్‌బీఐ నిర్ణయించడానికి ఇది కూడా ఒక కారణం.

SBI

SBI

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి