AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీగా పెరిగిన ధరలు.. బంగారం కొనేందుకు ఆ దేశానికి భారతీయుల పరుగు!

పశ్చిమ ఆసియా యుద్ధం ప్రభావంతో డాలర్ బలపడటం, రూపాయి బలహీనపడటం నేపథ్యంలో భారత్ బంగారంపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు పెరగడంతో, తక్కువ ధరలకు కొనుగోలు చేసేందుకు భారతీయులు పెద్ద సంఖ్యలో దుబాయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

భారీగా పెరిగిన ధరలు.. బంగారం కొనేందుకు ఆ దేశానికి భారతీయుల పరుగు!
Dubai Gold Market
SN Pasha
|

Updated on: May 23, 2026 | 7:30 PM

Share

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరల పెరుగుదల, గ్యాస్ సరఫరా సమస్యలు, అమెరికా డాలర్ బలపడటం వంటి పరిణామాలు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి పెంచుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో విదేశీ మారక ద్రవ్య వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని భారీగా పెంచింది.

ఇప్పటివరకు సుమారు 6 శాతంగా ఉన్న బంగారం దిగుమతి సుంకాన్ని 16 శాతానికి పెంచడంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. పెళ్లిళ్లు, పెట్టుబడులు, సంప్రదాయ అవసరాల కోసం బంగారం కొనుగోలు చేసే భారతీయులకు ఇది పెద్ద భారంగా మారింది. దీంతో తక్కువ ధరకు బంగారం లభించే ప్రత్యామ్నాయాలను ప్రజలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయులు దుబాయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దుబాయ్‌లో బంగారం ధరలు భారతదేశంతో పోలిస్తే తక్కువగా ఉండటంతో పాటు, ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు కూడా తక్కువగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

దుబాయ్ గోల్డ్ సూక్ ప్రాంతంలోని ఆభరణాల దుకాణాల్లో ఇటీవల భారతీయ కొనుగోలుదారుల రద్దీ గణనీయంగా పెరిగినట్లు వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే విదేశాల నుంచి బంగారం తీసుకురావడంపై కస్టమ్స్ నిబంధనలు కఠినంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుమతించిన పరిమితిని మించి బంగారం తీసుకొస్తే భారీ జరిమానాలు, స్వాధీనం వంటి చర్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అందువల్ల తక్కువ ధరల ఆశతో కొనుగోళ్లు చేసే ముందు ప్రయాణికులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం రూపాయి బలహీనత, పెరిగిన దిగుమతి సుంకాలు కలిసి దేశీయ బంగారం మార్కెట్‌పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us