AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RS 75 Coin: రూ. 75 నాణెన్ని ఎందుకు తీసుకొచ్చారు.? దీనిని ఎలా కొనుగోలు చేయాలో తెలుసా.?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28న లోక్‌సభ ఛాంబర్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ప్రత్యేక స్మారక రూ.75 నాణెం విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల శాఖ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..

RS 75 Coin: రూ. 75 నాణెన్ని ఎందుకు తీసుకొచ్చారు.? దీనిని ఎలా కొనుగోలు చేయాలో తెలుసా.?
Rs 75 Coin
Narender Vaitla
|

Updated on: May 30, 2023 | 7:34 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28న లోక్‌సభ ఛాంబర్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ప్రత్యేక స్మారక రూ.75 నాణెం విడుదల చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల శాఖ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, నాణెం బరువు దాదాపు 35 గ్రాములు ఉంటుంది. అసలు ఈ నాణెం ఎవరు తీసుకోవచ్చు. దేనిని బయట చెలామణీలోకి తీసుకువస్తారా? వంటి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ముందుగా అసలు ప్రభుత్వం రూ.75 నాణెం ఎందుకు తీసుకొచ్చింది? అనే విషయాన్ని చూద్దాం.. మే 28న, కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ రూ.75 డినామినేషన్ నాణెంతో వచ్చింది. మంత్రిత్వ శాఖ చెబుతున్న దాని ప్రకారం, నాణెం ముందరి వైపు మధ్యలో ‘అశోక స్తంభం’ సింహం, రాజధానిని కలిగి ఉంటుంది. దాని కింద ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. అశోక స్తంభానికి ఎడమ అంచున దేవనాగ్రి లిపిలో ‘భారత్’ అలాగే కుడి అంచున ఆంగ్లంలో ‘ఇండియా’ అనే పదం ఉంటుంది.

ఈ నాణెం సాధారణ చలామణిలో ఉంటుందా అనేది తెలుసుకుందాం.. ఇవి సాధారణ చెలామణీ కోసం తీసుకువచ్చిన నాణేలు కావు. వీటిని స్మారక నాణేలు అని పిలుస్తారు, వీటిని లావాదేవీలకు ఉపయోగించలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. స్మారక నాణేలు సాధారణంగా ముఖ్యమైన సంఘటనల జ్ఞాపకార్థం విడుదల చేస్తారు. అవి ప్రాతినిధ్యం వహించే సందర్భాన్ని ప్రతిబింబించే ప్రత్యేక డిజైన్‌లను ప్రదర్శిస్తాయి. ఈ నాణేలు నాణేల సేకరణకు గొప్ప విలువను కలిగి ఉంటాయి. నాణేలు సేకరించే హాబీ ఉన్నవారికి ఇవి చాలా విలువైనవిగా ఉంటాయి. 1964 నుంచి ఇలా ప్రత్యేక నాణేలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు 150 కంటే ఎక్కువ నాణేలు విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

వీటిని ఎవరు.. ఎలా కొనుక్కోవచ్చు అనే అంశాన్ని పరిశీలిద్దాం.. ఎవరైనా ప్రభుత్వ వెబ్‌సైట్ www.indiagovtmint.in నుంచి ఈ నాణేన్ని కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా, ప్రభుత్వం రాసే సమయానికి ఇప్పటివరకు నాణెం ధరను లిస్ట్ చేయలేదు కానీ అది త్వరలో వెల్లడి అవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ నాణెం తయారీకి వాడిన మెటీరీయల్ ధర కనీసం 13 వందల రూపాయలు ఉండవచ్చని జ్యుయలరీ నిపుణులు అంచనా వేస్తున్నారు. నాణెం తయారీ తరువాత అమ్మకానికి ఎంత ధర ఉంటుంది అనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుంది.

రూ.75 నాణెం తయారీలో ఏ లోహాలను ఉపయోగిస్తారో తెలుసుకుందాం. నాణెం 44 మిమీ వ్యాసం కలిగి ఉంది. ఇది 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో కూడిన క్వాటర్నరీ మిశ్రమంతో కూడి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా, 35 గ్రాముల బరువున్న నాణెం దాని అంచుల వెంట 200 సెర్రేషన్‌లను కలిగి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు
600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు
బిగ్‏బాస్ 10లోకి అడుగుపెట్టేది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్..
బిగ్‏బాస్ 10లోకి అడుగుపెట్టేది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్..
నాభి పైన బంగారం.. కింద వెండి ఎందుకు? ఆభరణాలు ధరించడంలో ఈ విషయాలు
నాభి పైన బంగారం.. కింద వెండి ఎందుకు? ఆభరణాలు ధరించడంలో ఈ విషయాలు
కోట్లు పక్కనపెట్టి చిన్న పల్లెటూరిలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే
కోట్లు పక్కనపెట్టి చిన్న పల్లెటూరిలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు