AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8th Pay Commission: ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకురానుందా?

ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎనిమిదో వేతన సంఘం రాకతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే 8వ వేతన సంఘం తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది..

8th Pay Commission: ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకురానుందా?
8th Pay Commission
Subhash Goud
|

Updated on: Feb 24, 2024 | 4:14 PM

Share

ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని తీసుకువస్తుందా అనేది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎనిమిదో వేతన సంఘం రాకతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే 8వ వేతన సంఘం తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ మోడీ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో దీనిని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు.

8వ వేతన సంఘం వస్తే ఉద్యోగుల జీతాలు పెంపు

ఎన్నికలకు ముందు 8వ వేతన సంఘం తీసుకువచ్చినట్లయితే ఉద్యోగులకు ఎంతగానో మేలు జరుగనుంది. ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇదే జరిగితే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రభుత్వ అధికారుల జీతాలు పెరుగుతాయి. ఉద్యోగుల జీతం, పే స్కేల్, అలవెన్సులు పే కమిషన్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ఎనిమిదో వేతన సంఘం రాకతో ఇవన్నీ పెరగనున్నాయి. ఉద్యోగులకు ప్రతి పదేళ్ల తర్వాత పే కమిషన్‌ను అమలు చేస్తారు. ఇప్పటి వరకు 5వ, 6వ, 7వ వేతన సంఘం అమలులోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

అన్ని అలవెన్సులు పెరుగుతాయి

8వ వేతన సంఘం రాకతో ఉద్యోగుల బేసిక్ వేతనం, డియర్‌నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ తదితరాలన్నీ పెరగనున్నాయి. ప్రాథమిక వేతనం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) నిర్ణయించబడుతుంది.

8వ వేతన కమిషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది

ఇటీవల ప్రభుత్వం 8వ వేతన కమిషన్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన ఇచ్చింది. దీనిలో ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ మాట్లాడుతూ.. వచ్చే జాతీయ ఎన్నికలలోపు సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన కమిషన్‌ను రూపొందించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..