AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 31 వరకు గడువు పెంపు.. ఇదే చివరి అవకాశమన్న కేంద్రం

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా సాయం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది..

PM Kisan: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఆగస్టు 31 వరకు గడువు పెంపు.. ఇదే చివరి అవకాశమన్న కేంద్రం
Pm Kisan Samman Nidhi Yojana
Subhash Goud
|

Updated on: Aug 19, 2022 | 4:24 PM

Share

PM Kisan: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా సాయం అందించేందుకు పథకాలను రూపొందిస్తోంది మోడీ సర్కార్‌. ఇక కేంద్ర ప్రవేశపెడుతున్న పథకాలలో ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా దేశంలోని రైతులు ఏడాదికి రూ.6,000 చొప్పున సాయం అందుకోవచ్చు. ఈ పథకం కింద ఏడాదిలో మూడు విడతల్లో ఈ డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. సంవత్సరంలో మూడు దఫాల్లో రూ.2,000 చొప్పున రైతులు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు రైతులు 11వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 12వ విడత అందుకోనున్నారు. ఈ విడత డబ్బులు సెప్టెంబర్‌లో రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. ఇక ఈ పథకంలో ముఖ్య విషయం ఏంటంటే.. కేవైసీ. ఈ పథకం కింద సాయం పొందుతున్న ప్రతి రైతు కూడా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఈ స్కీమ్‌ ద్వారా డబ్బులు పొంది ఈకేవైసీ పూర్తి చేసుకోనట్లయితే 12వ విడత మీ ఖాతాలో జమ కావు. అందుకే వ్యవసాయంలో పెట్టుబడి సాయంగా ఈ డబ్బులు అందుకోవాలంటే ఈకేవైసీ (EKYC) చేసుకోవడం తప్పనిసరి.

ఈకేవైసీ గడువు పెంపు.. ఇప్పటి వరకు ఈకేవైసీ గడువు జులై 31తో ముసిగిన విషయం తెలిసిందే. ఇంకా కొంత మంది రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయలేరు. దీంతో మోడా ప్రభుత్వం రైతులకు మరోమారు అవకాశం కల్పించింది. ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డబ్బులు మీ ఖాతాలో జమ కావని గుర్తించుకోవాలి. వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని రైతులకు సూచించింది కేంద్రం. మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు.

ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి..? ☛ ముందుగా పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

ఇవి కూడా చదవండి

☛ ఆ వెబ్‌సైట్‌లో కుడివైపు కనిపించే ఈ-కేవైసీపై క్లిక్‌ చేయాలి.

☛ అందులో ఆధార్‌ నెంబర్‌, కనిపించే కోడ్‌ను నమోదు చేయాలి.

☛ ఆధార్‌తో లింకైన మొబైల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

☛ పూర్తి వివరాలు నమోదు చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్‌ చేయాలి.

☛ అన్ని వివరాలు సరిగ్గా ఉంటే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

ఇక మీ దగ్గరలో ఉన్న ఈ-సేవ కేంద్రాలకు కూడా వెళ్లి ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?