AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ స్కీమ్‌ అప్‌డేట్‌.. ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే..!

దేశంలోని రైతుల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తోంది. తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. ప్రధాన..

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ స్కీమ్‌ అప్‌డేట్‌.. ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే..!
Pm Kisan Update
Subhash Goud
|

Updated on: Feb 19, 2023 | 7:00 AM

Share

దేశంలోని రైతుల కోసం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన పథకాలను అమలు చేస్తోంది. తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో ఇప్పటివరకు 12 విడతలు రైతుల ఖాతాలకు చేరాయి. 13వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించిన కొత్త అప్‌డేట్ ఏమిటో తెలుసుకోండి.

హోలీకి ముందు వాయిదాలు అందుకోవచ్చు:

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత హోలీలోపు రైతుల ఖాతాలోకి వస్తుందని భావిస్తున్నారు. త్వరలో 13వ విడత విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకాన్ని ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించింది మోడీ సర్కార్‌. అంటే ఫిబ్రవరి 24, 2023 నాటికి ఈ పథకం 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ రోజున ప్రభుత్వం ఖాతాలోకి నిధులను బదిలీ చేయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి తేదీని ప్రకటించలేకపోయినా అదే రోజు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, రైతుల ఆర్థిక స్థాయిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.6000 సహాయం అందజేస్తారు. ఈ మొత్తం 6000 రూపాయలు మూడు వాయిదాల్లో అందజేస్తోంది కేంద్రం.

ఇవి కూడా చదవండి

జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి, మీరు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి. మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. జాబితా మీ ముందు కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చెక్‌ చేసుకోవచ్చు.

e-KYC చేయాలి

ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఇ-కేవైసీ తప్పనిసరి. కేవైసీ లేని రైతులకు ఈ విడత డబ్బులు నిలిచిపోనున్నాయి. e-KYC పూర్తి చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ ఫార్మర్ కార్నర్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అందులో e-KYCపై క్లిక్ చేయాలి. దీని తర్వాత కొత్త పేజీ తెరిచినప్పుడు ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆధార్ నుండి నమోదైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసిన తర్వాత తర్వాత e-KYC పూర్తవుతుంది.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 17 అక్టోబర్ 2022న రైతుల ఖాతాకు 12వ విడతను విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. 2019లో పీఎం కిసాన్‌ లబ్ధిదారుల సంఖ్య 3.16 కోట్లు కాగా, 2022లో 10.45 కోట్లకు పెరిగింది. అర్హులైన రైతులు ఈ పథకం ప్రయోజనం పొందేందుకు వీలుగా అనర్హులను జాబితా నుంచి మినహాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి