AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phishing Scam: కేవైసీ పేరుతో అడ్డంగా మోసపోయినా 40 మంది.. బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం

గతంలో రోడ్లపై మోసగాళ్లు అమాయకులను మోసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి . ఇప్పుడు మోసగాళ్ళు ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి అనేక మార్గాలను..

Phishing Scam: కేవైసీ పేరుతో అడ్డంగా మోసపోయినా 40 మంది.. బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం
Phishing Scam
Subhash Goud
|

Updated on: Mar 06, 2023 | 1:14 PM

Share

గతంలో రోడ్లపై మోసగాళ్లు అమాయకులను మోసం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి . ఇప్పుడు మోసగాళ్ళు ఆన్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. వివిధ రహస్య సందేశాల ద్వారా కస్టమర్లను మోసం చేయడం జరుగుతోంది. ఇటువంటి అనేక ఫిషింగ్ నేర సంఘటనలు (ఫిషింగ్ స్కామ్‌లు) వివిధ ప్రదేశాలలో చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం పదే పదే హెచ్చరించినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు . మహారాష్ట్రలో ఇలాంటి ఆన్‌లైన్ ఫిషింగ్ నెట్‌వర్క్ కారణంగా చాలా మంది లక్షల రూపాయలను కోల్పోయారు.

కేవలం మూడు రోజుల్లోనే 40 మంది బ్యాంకు ఖాతాదారులు లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు. కేవైసీ, పాన్‌ కార్డు వివరాలను అప్‌డేట్ చేయమని చెప్పి మోసగాళ్లు పంపిన లింక్‌లను క్లిక్ చేయడం ద్వారా అమాయకులు డబ్బును పోగొట్టుకున్నారు. మోసపోయిన 40 మందిలో టీవీ యాంకర్ శ్వేతా మెమన్ ఒకరు .

మోసం ఎలా చేస్తారు ?

ఈ స్కామర్‌లు పంపిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు నకిలీ బ్యాంక్ వెబ్‌సైట్‌కి తీసుకెళతారు. అసలు వెబ్‌సైట్ మాదిరిగానే నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే వినియోగదారులు దారుణంగా మోసపోతారు. టీవీ ప్రెజెంటర్ శ్వేతా మెమన్ అటువంటి మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేసినప్పుడు ఆమె బ్యాంక్ నకిలీ వెబ్‌సైట్ ఓపెన్‌ అయ్యింది. ఆమె తన బ్యాంక్ కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్ , ఓటీపీ మొదలైనవాటిని నమోదు చేయమని కోరారు. దీని తర్వాత, మోసగాళ్లు ఈ ఐడీ, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి అసలు వెబ్‌సైట్‌కి వెళ్లి లాగిన్ అయ్యారు . అప్పుడు ఓ మహిళ శ్వేతకు ఫోన్ చేసి మరో ఓటీపీ ఇవ్వాలని కోరింది. ఈ నంబర్ ఇచ్చిన తర్వాత శ్వేతా బ్యాంక్ ఖాతా నుంచి రూ.57,636 డెబిట్ అయ్యాయి. దీని తరువాత, శ్వేత తాను మోసపోయానని తెలుసుకుంది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇదే సమయంలో మరో 40 మంది ఇలాంటి మోసానికి గురైనట్లు పోలీసులకు తెలిసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసాలు ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకునే మోసగాళ్లు అమాయకులను ముంచేస్తున్నారు. అందుకే ఇలాంటి లింక్‌లపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు పదేపదే చెబుతున్నారు. అయినా ఏదో విధంగా ఎంతో మంది మోసానికి గురవుతూనే ఉన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి