AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paytm: మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..

దేశంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన Paytm యజమాని One 97 కమ్యూనికేషన్స్ బలం మళ్లీ కనిపిస్తుంది. కంపెనీ నిర్వహణ ఆదాయం త్రైమాసికం తర్వాత మెరుగుపడుతోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) రూ. 1500 కోట్ల స్థాయిని అధిగమించింది. పేటీఎం ఇటీవల తన సేవలను మెరుగుపరిచింది. యూపీఐ చెల్లింపులతో పాటు, క్యూఆర్‌ కోడ్ చెల్లింపు సర్వీసు..

Paytm: మళ్లీ పుంజుకుంటున్న పేటీఎం.. నష్టాల నుంచి లాభాల వైపు..
Paytm
Subhash Goud
|

Updated on: Jul 19, 2024 | 4:13 PM

Share

దేశంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన Paytm యజమాని One 97 కమ్యూనికేషన్స్ బలం మళ్లీ కనిపిస్తుంది. కంపెనీ నిర్వహణ ఆదాయం త్రైమాసికం తర్వాత మెరుగుపడుతోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) రూ. 1500 కోట్ల స్థాయిని అధిగమించింది. పేటీఎం ఇటీవల తన సేవలను మెరుగుపరిచింది. యూపీఐ చెల్లింపులతో పాటు, క్యూఆర్‌ కోడ్ చెల్లింపు సర్వీసు, సౌండ్ బాక్స్, ఇతర ఆర్థిక ఉత్పత్తులపై దృష్టి సారించింది. పేటీఎం దాని సమయం వరకు దేశంలోనే అతిపెద్ద ఐపీవోని తీసుకువచ్చింది. కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఇటీవల అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాని ప్రభావం పనితీరుపై కనిపిస్తుంది. ఇప్పుడు కంపెనీ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మెరుగైన నిర్వహణ ఆదాయం కారణంగా సంస్థ మొత్తం నష్టం తగ్గింది.

పేటీఎం నిర్వహణ ఆదాయం మెరుగ్గా..

స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో ఏప్రిల్-జూన్‌లో తమ నిర్వహణ ఆదాయం రూ. 1502 కోట్లుగా పేటీఎం పేర్కొంది. పన్ను చెల్లించే ముందు కంపెనీ ఆదాయాన్ని లెక్కించిన తర్వాత (EBITDA) దాని నికర నష్టం రూ.792 కోట్లు. మెరుగైన రాబడి కారణంగా రాబోయే కాలంలో లాభదాయకత కూడా మెరుగుపడుతుందని కంపెనీ పేర్కొంది. ఆర్థిక సేవల ద్వారా కంపెనీ ఆదాయం రూ.280 కోట్లు. కాగా మార్కెటింగ్ సేవల ద్వారా కంపెనీ రూ.321 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ లాభాల మార్జిన్ 50 శాతంగా ఉంది. దీని కారణంగా కంట్రిబ్యూషన్ లాభం రూ.755 కోట్లుగా ఉంది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ మెరుగుపడింది. అలాగే దాని వద్ద రూ. 8,108 కోట్ల నగదు ఉంది. ఇదిలా ఉండగా, మా వినియోగదారుల సంఖ్య స్థిరంగా ఉందని పేటీఎం ప్రతినిధి చెప్పారు. మర్చంట్ ఆపరేటింగ్ మెట్రిక్స్‌లో మెరుగుదల ఉందని. ఇది రాబోయే రోజుల్లో మెరుగైన రికవరీకి మార్గాన్ని చూపుతుంది.

ఈ కారణాల వల్ల పేటిఎం తిరిగి పుంజుకుంది:

పేటీఎంతన ఆర్థిక ఫలితాలలో తన వ్యాపారి చెల్లింపు నిర్వహణ వ్యాపారం జనవరి 2024 స్థాయికి తిరిగి వచ్చిందని సంస్థ తెలిపింది. కంపెనీ మళ్లీ తన క్యూఆర్ కోడ్‌లు, సౌండ్‌బాక్స్‌లను దుకాణదారుల వద్ద ఇన్‌స్టాల్ చేయడం ప్రారంభించింది. కంపెనీ మర్చంట్ సబ్‌స్క్రైబర్ బేస్ మెరుగుపడి ఇప్పుడు 1.09 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా Paytm ప్లాట్‌ఫారమ్‌లో చేసిన మొత్తం వ్యాపార విలువ (GMV) కూడా జనవరి 2024కి ముందు స్థాయికి తిరిగి వచ్చింది. జూన్ త్రైమాసికంలో ఇది రూ.4.3 లక్షల కోట్లు. ఇది కాకుండా, కంపెనీ ఖర్చు ఆప్టిమైజేషన్‌పై కూడా చాలా శ్రద్ధ చూపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి