AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025: గురజాడ పద్యాన్ని ప్రస్తావిస్తూ నిర్మలా బడ్జెట్‌ ప్రసంగం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, శనివారం నాడు పార్లమెంటులో సమర్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ఎన్నో ఆశలు ఉన్నాయి..

Budget 2025: గురజాడ పద్యాన్ని ప్రస్తావిస్తూ నిర్మలా బడ్జెట్‌ ప్రసంగం
Subhash Goud
|

Updated on: Feb 01, 2025 | 11:17 AM

Share

Budget 2025: విపక్షాల నిరసనల మధ్య ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావు పద్యం ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’ అనే పద్యాన్ని ప్రస్తావించారు మంత్రి. నిర్మలా సీతారామన్‌ రికార్డు స్థాయిలో వరుసగా 8వ సారి పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మూడోసారి నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో వార్షిక బడ్జెట్‌. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో మా దృష్టి ‘జ్ఞాన్‌పైనే ఉంది. పదేళ్లలో బహుముఖాభివృద్ధి సాధించామని అన్నారు.