Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓలో పెట్టుబడి పెట్టి నష్టాల్లో ఉన్నారా.. అయితే మీకు ఇది శుభవార్తే..!

మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IPOలో పెట్టుబడి పెట్టి మీరు లిస్టింగ్ లాభం పొంది ఉండకపోవచ్చు కానీ.. కంపెనీ ఇప్పుడు డివిడెండ్ చెల్లించాలని ఆలోచిస్తోంది...

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓలో పెట్టుబడి పెట్టి నష్టాల్లో ఉన్నారా.. అయితే మీకు ఇది శుభవార్తే..!
Lic
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 24, 2022 | 3:19 PM

మీరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ IPOలో పెట్టుబడి పెట్టి మీరు లిస్టింగ్ లాభం పొంది ఉండకపోవచ్చు కానీ.. కంపెనీ ఇప్పుడు డివిడెండ్ చెల్లించాలని ఆలోచిస్తోంది. మార్చి త్రైమాసిక ఫలితాలను కంపెనీ మే 30న ప్రకటించనుంది. ఎల్‌ఐసి (LIC) తరపున రిజల్ట్ ప్రకటించడమే కాకుండా ఆ రోజు డివిడెండ్ చెల్లించే నిర్ణయాన్ని బోర్డు తీసుకోవచ్చని తెలిపింది. స్టాక్ మార్కెట్‌(Stock Market)కు ఇచ్చిన సమాచారంలో జీవిత బీమా సంస్థ మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆడిట్ చేసిన ఫలితాలు, త్రైమాసిక ఫలితాలు, కంపెనీ పనితీరుకు సంబంధించిన ఫలితాలను మే 30న ప్రకటిస్తుంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు డివిడెండ్(Dividend) చెల్లించాలని నిర్ణయించుకుంటే, అదే రోజున ప్రకటించవచ్చు. మధ్యాహ్నం 2.40 గంటలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేరు రూ.822 స్థాయిలో ట్రేడవుతోంది. ఇది లిస్టింగ్ ధర కంటే 13 శాతం తక్కువ. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ 5.25 లక్షల కోట్లకు చేరువలో ఉంది. ఎల్‌ఐసీ 21 వేల కోట్ల ఐపీఓ చాలా బలహీనంగా ఉంది. ఇది 9 శాతం తగ్గింపుతో మే 17న స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయింది. దీని ఇష్యూ ధర రూ.949. రూ.818 స్థాయికి దిగజారింది.

LIC లిస్టింగ్ తర్వాత, DIPAM కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే మాట్లాడుతూ ఊహించని మార్కెట్ పరిస్థితుల కారణంగా దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ LIC బలహీనంగా ప్రారంభమైందని చెప్పారు. దీర్ఘకాలంలో లాభాలు పొందేందుకు ఎల్‌ఐసీ షేర్లను ఉంచుకోవాలని ఆయన ఇన్వెస్టర్లకు సూచించారు. స్టాక్ మార్కెట్‌ను ఎవరూ ఊహించలేరని పాండే అన్నారు. సెకండరీ మార్కెట్‌లో షేర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని, దాని కారణంగా ధర పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో భయాందోళనలు నెలకొని ఉన్నాయని, దీని వల్ల భారీ జంప్‌ను ఊహించలేదన్నారు. మనం ముందుకు వెళ్లే కొద్దీ స్టాక్ పెరుగుతుందని ఎల్‌ఐసీ ఛైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పారు. అలాట్‌మెంట్ పొందలేని పాలసీదారులు సెకండరీ మార్కెట్‌లో కొనుగోలు చేస్తారని అన్నారు. DIPAM సెక్రటరీ ఈ అభిప్రాయం కూడా చాలా మంది మార్కెట్ నిపుణుల అభిప్రాయానికి అనుగుణంగా ఉంది. చాలా మంది మార్కెట్ నిపుణులు స్టాక్ హోల్డర్‌లకు పెట్టుబడిని కొనసాగించాలని సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి..