Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. భారీగా పడిపోయిన ఐటీ, ఫార్మా స్టాక్స్‌.. రాణించిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ షేర్లు..

స్టాక్‌ మార్కెట్లు(Stock Market) వరుసగా రెండో సెషన్‌లో నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT), ఫార్మా(Pharma), కన్స్యూమర్ గూడ్స్ స్టాక్‌లు స్టాక్‌ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి...

Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. భారీగా పడిపోయిన ఐటీ, ఫార్మా స్టాక్స్‌.. రాణించిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ షేర్లు..
Stock Market
Follow us
Srinivas Chekkilla

|

Updated on: May 24, 2022 | 4:15 PM

స్టాక్‌ మార్కెట్లు(Stock Market) వరుసగా రెండో సెషన్‌లో నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT), ఫార్మా(Pharma), కన్స్యూమర్ గూడ్స్ స్టాక్‌లు స్టాక్‌ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్ల పెంపుదల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మంగళవారం BSE సెన్సెక్స్ 236 పాయింట్లు పెరిగి 54,053 వద్ద ముగియగా, NSE నిఫ్టీ 90 పాయింట్లు క్షీణించి 16,125 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.65 శాతం, స్మాల్ క్యాప్ 1.26 శాతం క్షీణించాయి. సబ్-ఇండెక్స్‌లు నిఫ్టీ ఐటి1.88, నిఫ్టీ ఫార్మా 1.53, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.30 శాతం వరకు పడిపోయాయి. దివీస్ ల్యాబ్స్ నిఫ్టీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఈ స్టాక్‌ 6 శాతం పతనమై రూ. 3,663.90కి చేరుకుంది. టెక్ మహీంద్రా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ యూనిలీవర్ మరియు హిందాల్కో కూడా నష్టపోయాయి.

30 షేర్ల బిఎస్ఈ ఇండెక్స్‌లో టెక్‌ఎమ్, హెచ్‌యుఎల్, హెచ్‌సిఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టిపిసి, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ లూజర్‌గా ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ (హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్), కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బిఐ మరియు బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో స్థిరపడ్డాయి. ప్రభుత్వ రంగ బీమా సంస్థ తన బోర్డు డివిడెండ్ చెల్లింపును పరిశీలిస్తుందని చెప్పడంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు 0.84 శాతం పెరిగి రూ. 823.75 వద్ద ముగిశాయి. ఎల్‌ఐసి గత వారం ఎక్స్ఛేంజీలలో అరంగేట్రం చేసింది. దాని ఇష్యూ ధర రూ. 949 కాగా 8.62 శాతం తగ్గింపుతో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయింది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ 75.01 శాతం పెరుగుదలను నమోదు చేయడంతో Zomato 13.95 శాతం జూమ్ చేసి రూ. 64.95 వద్ద ముగిసింది.

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…