AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డు ఏమవుతుంది..? ఆటో డిసేబుల్ సిస్టమ్ వస్తుందా?

దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు దుర్వినియోగం అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఆధార్ కార్డు కూడా కొన్ని సందర్భాల్లో వినియోగిస్తున్నారు. వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని ఆధార్ కార్డు చెక్కుచెదరకుండా ఉండడం చూసే ఉంటారు. ఇప్పుడు దీనిని నివారించడానికి, ప్రభుత్వం కొత్త యంత్రాంగాన్ని..

Aadhaar Card: ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డు ఏమవుతుంది..? ఆటో డిసేబుల్ సిస్టమ్ వస్తుందా?
Aadhaar Card
Subhash Goud
|

Updated on: Mar 23, 2023 | 9:30 PM

Share

దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు దుర్వినియోగం అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఆధార్ కార్డు కూడా కొన్ని సందర్భాల్లో వినియోగిస్తున్నారు. వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని ఆధార్ కార్డు చెక్కుచెదరకుండా ఉండడం చూసే ఉంటారు. ఇప్పుడు దీనిని నివారించడానికి, ప్రభుత్వం కొత్త యంత్రాంగాన్ని అమలు చేస్తుంది. UIDAI, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేసే విధానాన్ని తీసుకువస్తున్నారు. ఈ కొత్త విధానంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మరణానికి సంబంధించిన అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అతని ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది.

చనిపోయిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ఎలా ?

ఏ పౌరుడు మరణించినా తప్పనిసరిగా జనన మరణ రికార్డులలో నమోదు చేయబడాలి. అందువల్ల, మరణాన్ని నమోదు చేసేటప్పుడు వ్యక్తి ఆధార్ నంబర్ తప్పనిసరి. మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు వ్యక్తి కుటుంబ సభ్యుల అనుమతితో ఆధార్ కార్డ్ డియాక్టివేట్ చేయబడుతుంది. ఇది ఇప్పుడు అమలులోకి రానున్న కొత్త వ్యవస్థ.

అటువంటి వ్యవస్థ కోసం మొదటి ప్రతిపాదనను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా చేసింది.మరణ ధృవీకరణ పత్రం జారీ చేసేటప్పుడు ఆధార్ పత్రాలను పొందడం గురించి UIDAIని సంప్రదించారు . ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును తొలగించేందుకు రెండు సంస్థలు సంయుక్తంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

జూన్ 14 వరకు ఉచిత ఆధార్ అప్‌డేట్:

ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ కార్డుకు పత్రాలను జోడించడానికి జూన్ 14 వరకు అనుమతి ఉంది. ఈ ఉచిత సేవ ఆధార్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. ఇంతకు ముందు ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్ కోసం 25 రూపాయల ఫీజు వసూలు చేసేవారు.

ఆధార్ కార్డు ఉన్నవారు ప్రతి పదేళ్లకోసారి తమ రికార్డులను అప్‌డేట్ చేయాలని కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీని కోసం ID రుజువు, చిరునామా రుజువు పత్రాలను సమర్పించాలి. వీటిని ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆధార్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. జూన్ 14 తర్వాత రుసుము చెల్లించి పత్రాన్ని అప్‌డేట్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి