Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ముఖేష్‌ అంబానీ 9వ స్థానం.. ఆదానీ ఏ స్థానంలో అంటే..!

గత ఏడాది కాలంలో చాలా మంది ధనవంతుల సంపద కరిగిపోయింది. భారతీయ వ్యాపారవేత్తలు చాలా నష్టపోయారు. ఈ సంవత్సరం ముఖేష్ అంబానీ. ఇతని 20 శాతం సంపద పోయింది. అంటే 21 బిలియన్ డాలర్లు ( దాదాపు 1.72 లక్షల కోట్ల రూపాయలు ) కోల్పోయారు. అయినప్పటికీ , ప్రపంచంలోని అత్యంత..

Mukesh Ambani: ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ముఖేష్‌ అంబానీ 9వ స్థానం.. ఆదానీ ఏ స్థానంలో అంటే..!
Mukesh Ambani - Ggautam Adani
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2023 | 7:42 PM

గత ఏడాది కాలంలో చాలా మంది ధనవంతుల సంపద కరిగిపోయింది. భారతీయ వ్యాపారవేత్తలు చాలా నష్టపోయారు. ఈ సంవత్సరం ముఖేష్ అంబానీ. ఇతని 20 శాతం సంపద పోయింది. అంటే 21 బిలియన్ డాలర్లు ( దాదాపు 1.72 లక్షల కోట్ల రూపాయలు ) కోల్పోయారు. అయినప్పటికీ , ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో అతని స్థానం టాప్ -10 కంటే తగ్గలేదు. M3M Hurun గ్లోబల్ రిచ్ లిస్ట్ 2023 ప్రకారం.. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని 9వ అత్యంత సంపన్న వ్యక్తి . 21బిలియన్ల డాలర్ల సంపద కనుమరుగైనప్పటికీ అంబానీకి 82 బిలియన్ డాలర్ల (6.74 లక్షల కోట్ల రూపాయలు ) ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు .

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ముఖేష్ అంబానీ చాలా సంవత్సరాలుగా భారతదేశం నంబర్ వన్ ధనవంతుడు. గత మూడు సంవత్సరాలుగా ఆసియాలో అత్యంత ధనవంతుడు అనే పేరుంది. ఒక దశలో, గౌతమ్ అదానీ ఫీనిక్స్ లాగా లేచి, ముఖేష్ అంబానీని అధిగమించి ప్రపంచంలోని టాప్ 3 ధనవంతులలో ఒకరిగా నిలిచాడు. ఈ జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అది అదానీకి పెద్ద షాక్ ఇచ్చింది. 35 శాతం ఆస్తులను కోల్పోయిన గౌతమ్ అదానీ సంపద ఇప్పుడు 53 బిలియన్ డాలర్లు (4.36 లక్షల కోట్ల రూపాయలు ). ప్రపంచ సంపన్నుల జాబితాలో గతేడాది 2వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు 23వ స్థానానికి పడిపోయింది .

గత ఏడాది గౌతమ్ అదానీ సగటున రోజుకు రూ .1,600 కోట్ల సంపదను పోగుచేసుకున్నారు . కిరాణా నుంచి సిమెంట్, విమానాశ్రయం, ఓడరేవు, మైనింగ్ మొదలైన వాటి వరకు గౌతమ్ అదానీ వ్యాపారం విస్తరిస్తోంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ చాలా వేగంగా ఎదుగుతున్న గౌతమ్ అదానీకి ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్‌కు చెందిన వివిధ కంపెనీల షేర్లు నిరంతరం పతనమవుతున్నాయి. చైనా నుంచి 178 మంది, అమెరికా నుంచి 123 మంది ఒక సంవత్సరంలో 1 బిలియన్ డాలర్ల విలువైన సంపదను కోల్పోయారు. ఈ జాబితాలో భారతదేశంలోని 41 మంది సంపన్నులు కూడా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఒక సంవత్సరంలో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదను పోగుచేసిన వ్యక్తుల జాబితాలో భారతదేశం 6 వ స్థానంలో ఉంది. కొత్త బిలియనీర్ల జాబితాలో భారతీయులు కూడా ముందున్నారు. గత ఏడాది కాలంలో 16 మంది భారతీయులు కొత్త బిలియనీర్లు అయ్యారు. రాకేష్ ఝుంఝునావాలా కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి