AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto News: భారత్‌లో మొట్టమొదటి మారుతి 800 కారును ఎవరు కొన్నారు? ఇందిరాగాంధీ చేతుల మీదుగా..

Muruti Suzuki: మారుతి 800 అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో ఒకటి. 30 ఏళ్లకు పైగా ప్రయాణంలో ఈ కారు తన పేరు మీద అనేక రికార్డులను సృష్టించింది. మారుతి 2,917,000 యూనిట్లను విక్రయించింది. మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఐ10, మారుతి సుజుకి

Auto News: భారత్‌లో మొట్టమొదటి మారుతి 800 కారును ఎవరు కొన్నారు? ఇందిరాగాంధీ చేతుల మీదుగా..
Subhash Goud
|

Updated on: Nov 16, 2024 | 8:02 PM

Share

మారుతి సుజుకి తాజాగా తన 4వ జనరేషన్‌ డిజైర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది, ఇది సెడాన్ సెగ్మెంట్‌లో మరోసారి తన పట్టును బలోపేతం చేసుకోబోతోంది. దీనితో పాటు, SUV సెగ్మెంట్లో మారుతి తన బలమైన ఉనికిని కూడా నమోదు చేసింది. నేడు మారుతీ దేశంలో అనేక వాహనాలను తయారు చేస్తోంది మరియు ఇప్పుడు పెట్రోల్-డీజిల్ కాకుండా, ఇది EV విభాగంలో కూడా విస్తరిస్తోంది. భారతదేశంలో మారుతి మొదటి కారు మారుతి 800. అయితే భారతదేశంలో దాని మొదటి కొనుగోలుదారు ఎవరో మీకు తెలుసా?

మొదటి కారు ఎక్కడ తయారు చేశారు?

మారుతీ తన మారుతీ 800ని 1983లో హర్యానాలో తయారైంది. దీని ధర రూ. 47,500. మారుతి 800 ఉత్పత్తి 2010లో నిలిపివేసింది కంపెనీ. అయితే 2004 వరకు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇది.

మొదటి కారును ఎవరు కొనుగోలు చేశారు?

మారుతీ 800 మొదటి కారును ఢిల్లీకి చెందిన హర్పాల్ సింగ్ కొనుగోలు చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఆయనకు తాళాలు అందజేశారు. హర్పాల్ సింగ్ 2010లో మరణించాడు. కానీ అప్పటి వరకు ఈ కారు అతని వద్ద ఉంది. ప్రస్తుతం ఈ మొదటి కారు మారుతి ప్రధాన కార్యాలయంలో ఉంచారు. దీని నంబర్ DIA 6479.

Maruti 800

ప్రత్యేక విక్రయాల రికార్డు:

మారుతి 800 అత్యధికంగా అమ్ముడైన వాహనాల్లో ఒకటి. 30 ఏళ్లకు పైగా ప్రయాణంలో ఈ కారు తన పేరు మీద అనేక రికార్డులను సృష్టించింది. మారుతి 2,917,000 యూనిట్లను విక్రయించింది. మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఐ10, మారుతి సుజుకి స్విఫ్ట్, మారుతి సుజుకి వాగోనీర్‌లను కలిగి ఉన్న నాలుగు కార్లు మాత్రమే భారతదేశంలో మారుతి 800 కంటే ఎక్కువ అమ్ముడయ్యాయి. మూసివేసే సమయంలో మారుతి 800లో 796cc, 3-సిలిండర్, పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 37bhp శక్తిని ఇచ్చింది. పెట్రోల్ వెర్షన్ మారుతి 800 ఏసీతో కూడిన ధర దాదాపు రూ.2.20 లక్షలు.

ఇది కూడా చదవండి: Hallmarking: ఇప్పుడు ఈ 18 రాష్ట్రాల్లో హాల్‌మార్క్‌ లేని ఆభరణాలు విక్రయించలేరు.. నిబంధనలు అమలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి