AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ సాయం పెంపు పార్లమెంట్‌లో కీలక ప్రకటన.. ప్చ్… రైతులకు బ్యాడ్ న్యూస్.. !

రైతులకు సాయం చేయాలనే తలంపుతో కేంద్రం సంవత్సరానికి రూ.6 వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఈ సాయాన్ని మూడు విడతలుగా అంటే రూ.2 వేలు చొప్పున అకౌంట్లో జమ చేస్తుంది. అయితే ఎన్నికల ఏడాది ఈ సాయాన్ని కేంద్ర పెంచుతుందని చాలా మంది భావించారు. అయితే ఇటీవల పార్లమెంట్‌లో ఈ పెంపు గురించి వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా కీలక ప్రకటన చేశారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

PM Kisan: పీఎం కిసాన్ సాయం పెంపు పార్లమెంట్‌లో కీలక ప్రకటన.. ప్చ్… రైతులకు బ్యాడ్ న్యూస్.. !
Pm Kisan
Nikhil
|

Updated on: Feb 07, 2024 | 6:00 PM

Share

భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. భారతదేశంలోని జీడీపీ పెంచడంలో వ్యవసాయం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే భారతదేశంలోని చాలా మంది రైతులు వ్యవసాయానికి పెట్టుబడి సమయంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడంతో పాటు రైతులకు సాయం చేయాలనే తలంపుతో కేంద్రం సంవత్సరానికి రూ.6 వేలను రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఈ సాయాన్ని మూడు విడతలుగా అంటే రూ.2 వేలు చొప్పున అకౌంట్లో జమ చేస్తుంది. అయితే ఎన్నికల ఏడాది ఈ సాయాన్ని కేంద్ర పెంచుతుందని చాలా మంది భావించారు. అయితే ఇటీవల పార్లమెంట్‌లో ఈ పెంపు గురించి వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా కీలక ప్రకటన చేశారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాన్ని ఏడాదికి రూ.8,000-12,000కు పెంచే ప్రతిపాదన లేదని ప్రభుత్వం మంగళవారం పార్లమెంటుకు తెలియజేసింది. ఈ పథకం కింద మహిళా రైతులకు కూడా పెంచే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2019లో ప్రారంభించబడిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఫండ్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. ప్రభుత్వం సంవత్సరానికి రూ. 8,000-12,000కి పెంచాలని యోచిస్తోందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, “ఏ ప్రతిపాదన పరిశీలనలో లేదు,” అని ఆయన అన్నారు.

పీఎం కిసాన్ పథకం కింద సాధించిన ప్రగతిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ  పథకం కింద ఇప్పటివరకు 15 విడతలుగా 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.81 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది. భూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలకు అనుబంధంగా ఈ ప్రయోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకాల్లో పీఎం-కిసాన్ ఒకటని ముండా చెప్పారు. రైతు-కేంద్రీకృత డిజిటల్ అవస్థాపన పథకానికి సంబంధించిన ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరేలా చేసింది. ప్రత్యేక ప్రశ్నకు ఉత్తరప్రదేశ్‌లో పథకం ప్రారంభించినప్పటి నుండి 2,62,45,829 మంది రైతులు పీఎం-కిసాన్ ప్రయోజనాన్ని పొందారని పేర్కొన్నారు. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంతో పాటు ధ్రువీకరించడం ఆయా రాష్ట్రాలు/యూటీల బాధ్యతని వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్
హైదరాబాద్ ఐటీని మించి.. అమరావతిలో క్వాంటం పవర్