AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Frauds: సైబర్ నేరాలను అరికట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ కీలక చర్యలు.. ఆ మోసాలపైనే చర్యలన్నీ..!

ఇటీవల కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యూఆర్ఎల్‌లు, ఫోన్ నంబర్‌లు, టెలిగ్రామ్ పరిచయాలు, సైబర్ మోసాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ల నుండి ప్రత్యేకంగా ఫిషింగ్, స్మిషింగ్‌ల నుంచి ఒక సమగ్ర డేటాబేస్‌ను తయారు చేసే పనిలో ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డిపాజిటరీ స్థాపనకు మార్గం సుగమం చేస్తున్నందున సైబర్ క్రైమ్‌ను ఎదుర్కోవడంలో ఈ డేటా కీలకమని సైబర్ సెల్ నిపుణులు పేర్కొంటున్నారు.

Cyber Frauds: సైబర్ నేరాలను అరికట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ కీలక చర్యలు.. ఆ మోసాలపైనే చర్యలన్నీ..!
Cyber Crimes
Nikhil
|

Updated on: Feb 07, 2024 | 5:30 PM

Share

ప్రస్తుత రోజుల్లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగాయి. అయితే వీటిని అరికట్టటడం పోలీసులకు పెద్ద సవాలుగా ఉంది. అయితే ఈ మోసాలను అరికట్టడం ఎంత ముఖ్యమో? వినియోగదారులకు ఈ మోసాలపై అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఇటీవల కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యూఆర్ఎల్‌లు, ఫోన్ నంబర్‌లు, టెలిగ్రామ్ పరిచయాలు, సైబర్ మోసాలకు సంబంధించిన వెబ్‌సైట్‌ల నుండి ప్రత్యేకంగా ఫిషింగ్, స్మిషింగ్‌ల నుంచి ఒక సమగ్ర డేటాబేస్‌ను తయారు చేసే పనిలో ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ డిపాజిటరీ స్థాపనకు మార్గం సుగమం చేస్తున్నందున సైబర్ క్రైమ్‌ను ఎదుర్కోవడంలో ఈ డేటా కీలకమని సైబర్ సెల్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ డిపాజిటరీ సైబర్ బెదిరింపులను గుర్తించడంతో పాటు సమస్యలను పరిష్కరించడంలో ప్రజలకు, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర తీసుకునే తాజా చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

కేంద్ర రూపొందిస్తున్న ప్రణాళిక ప్రకారం I4 సీ అనే వెబ్‌సైట్‌ని ఉపయోగించడం ద్వారా ఏదైనా పరిచయం, యూఆర్ఎల్ లేదా ఈ-మెయిల్ ఐడీకు సంబంధించిన చట్టబద్ధతను ధ్రువీకరించే వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా మోసానికి గురైన వ్యక్తులు సైబర్ క్రైమ్‌ను నివేదించేటప్పుడు వెబ్‌సైట్, ఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, యూపీఐ ఐడీ, మోసపూరిత చర్యలో పాల్గొన్న సోషల్ మీడియా ఖాతాల వంటి సమాచారాన్ని వివరించే ఫారమ్‌ను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. పౌరుడు అందించిన సమాచారం డిపాజిటరీలో చేరుస్తారు. ఈ మరొక ఫీచర్ యూజర్లు ఏదైనా సైబర్ క్రైమ్‌తో సంబంధం కలిగి ఉన్నారో? లేదో?  తెలుసుకోవడానికి మొబైల్ నంబర్, వెబ్‌సైట్, యూపీఐ ఐడీ మొదలైన వాటిని ఇన్‌పుట్ చేయడానికి అనుమతిస్తుంది. ఏదైనా నంబర్ లేదా ఖాతా సైబర్ మోసాలకు పాల్పడి ఉంటే పౌరులు తక్షణమే తనిఖీ చేయడంలో ఇది సహాయపడుతుంది.

అయితే ఈ డేటాకు సంబంధించిన దుర్వినియోగం గురించి ఆందోళనల గురించి డేటా బహుళ ఫిర్యాదుల ద్వారా మద్దతునిస్తుందని ఒంటరి సంఘటనలు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అదనంగా తప్పుడు వివరాలు ఉద్దేశపూర్వకంగా అందించబడిన సందర్భాలను పరిష్కరించడానికి నిబంధనలు అమలులో ఉన్నాయి. ఎవరైనా హానికరమైన తప్పు సమాచారాన్ని సమర్పించారని వారు విశ్వసిస్తే అభ్యర్థనలను ఫైల్ చేయడానికి వ్యక్తులను అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సీ) స్థానిక పోలీసు అధికారుల విచారణలో ఉన్న ఫిర్యాదుల ప్రామాణికతను ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది. డేటాబేస్‌లోని నిర్దిష్ట ఐడెంటిఫైయర్‌లతో విభేదించే వినియోగదారులు వ్యత్యాసాలను పరిష్కరించడానికి ఈ-మెయిల్‌ను పంపవచ్చు. ఈ డేటా ప్రకారం సైబర్ క్రైమ్ ట్రెండ్‌లు సగటున, రోజుకు 5,000 కంటే ఎక్కువ సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చూపుతున్నాయి. ఇది 2021 నుంచి 2022 వరకు 13.7% స్పైక్‌ను వెల్లడించింది. అయితే గత సంవత్సరంలో స్పైక్ 60.9 శాతంగా ఉంది. ఈ ఫిర్యాదుల సంఖ్య కనీసం 500 శాతం పెరిగి 2020లో 2.57 లక్షల నుంచి 2023లో 15.56 లక్షలకు చేరుకుంది. సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నివేదించడంలో హర్యానా, తెలంగాణ, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని ఎంహెచ్ఏ డేటా వెల్లడించింది. భారతదేశంలో ఆర్థిక మోసాలను ఎదుర్కొంటున్న సుమారు 50,000 మంది పౌరులకు సహాయం అందిస్తున్నట్లు ఎంహెచ్ఏ అందించిన డేటా చెబుతోంది. I4సీ సహాయంతో దాదాపు 4.3 లక్షల మంది బాధితులు రూ. 11.27 కోట్లు ఆదా చేశారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us