Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jet Fuel Price: భారీగా పెరిగిన ఫ్లైట్‌ ఇంధనం ధర.. టికెట్‌ రేటు పెరగనుందా..?

బెంగళూరు నుంచి ముంబై 850 కి.మీ. విమానానికి దాదాపు ఒకటిన్నర గంటల సమయం పడుతుంది. ముంబయి నుంచి ఢిల్లీకి అదే 1,200 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి 2 గంటలు సమయం పట్టిందనుకుందాం. విమానం గంటకు 600 కి.మీ వేగంతో వెళ్తుందని భావిస్తే అది నిమిషానికి 10 కి.మీ అవుతుంది. 192 సీట్లతో కూడిన ఎయిర్‌బస్ మధ్య తరహా విమానం పూర్తిగా లోడ్ అయినప్పుడు కిలోమీటరుకు 4.18 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఇంధన వినియోగం గంటకు...

Jet Fuel Price: భారీగా పెరిగిన ఫ్లైట్‌ ఇంధనం ధర.. టికెట్‌ రేటు పెరగనుందా..?
Jet Fuel Price
Follow us
Subhash Goud

|

Updated on: Sep 01, 2023 | 9:56 PM

గృహ, వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించిన సామాన్యులకు విమాన ప్రయాణం ఖరీదు కానుంది. విమానాలకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) లేదా జెట్ ఫ్యూయల్ ధరను వరుసగా మూడోసారి పెంచారు. అది కూడా శాతం 14 శాతం పెరిగింది. భారత విమానయాన చరిత్రలో జెట్ ఇంధన ధరలు ఎన్నడూ లేని విధంగా పెంచడం ఇదే అత్యధికం. ఏటీఎఫ్ ధర కిలోమీటరుకు రూ.13,911.07 పెరిగింది. దీనితో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలోమీటరుకు జెట్ ఇంధనం ధర రూ.1,12,419.33.

జూలై, ఆగస్టు నెలల్లో కూడా ఈటీఎఫ్ ధరలు పెరిగాయి. ఆగస్టు 1న జెట్ ఇంధనం ధర రూ.7,728.38 (8.5 శాతం), జూలై 1న రూ.1,476.79 (1.65 శాతం)గా ఉంది. మూడు వరుస ధరల పెంపులో ATF ధర రూ.23,116.24కి పెరిగింది. మూడేళ్ల క్రితం (జూన్ 24, 2020), న్యూఢిల్లీలో జెట్ ఇంధనం ధర కిలోమీటరుకు రూ. 39,069.87. గత మూడేళ్లలో రూ.70 వేలకు పైగా ధర పెరిగింది.

కిలోమీటరుకు జెట్ ఇంధనం ధర ఎంత?

ఇప్పుడు కిలోమీటరుకు జెట్ ఇంధనం ధర రూ.1,12,419.33. విమానం ఒక కిలోమీటరు ప్రయాణించేందుకు అయ్యే ఇంధనం ఇది. కానీ కేవలం లీటర్ పరంగా చెప్పాలంటే ఒక లీటర్ ధర 112 రూపాయలు.

ఇవి కూడా చదవండి

విమానానికి ఎంత ఇంధనం అవసరం?

బస్సులు, కార్లు మొదలైన వాహనాలు వేర్వేరు మైలేజీని ఇచ్చినట్లే, విమానాల ఇంధన వినియోగంలో కూడా వైవిధ్యాలు ఉన్నాయి. ఎయిర్ బస్ ఇచ్చే మైలేజీ వేరు, బోయింగ్ కంపెనీ విమానాలు ఇచ్చే మైలేజీ వేరు. విమానంలోని ప్రయాణికుల సంఖ్య కూడా మైలేజీని ప్రభావితం చేస్తుంది.

ఉదాహరణకు బెంగళూరు నుంచి ముంబై 850 కి.మీ. విమానానికి దాదాపు ఒకటిన్నర గంటల సమయం పడుతుంది. ముంబయి నుంచి ఢిల్లీకి అదే 1,200 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి 2 గంటలు సమయం పట్టిందనుకుందాం. విమానం గంటకు 600 కి.మీ వేగంతో వెళ్తుందని భావిస్తే అది నిమిషానికి 10 కి.మీ అవుతుంది. 192 సీట్లతో కూడిన ఎయిర్‌బస్ మధ్య తరహా విమానం పూర్తిగా లోడ్ అయినప్పుడు కిలోమీటరుకు 4.18 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఇంధన వినియోగం గంటకు 2,508 లీటర్లు.

అలాగే బోయింగ్ 747 విమానాల విషయానికి వస్తే గంటకు 14,400 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది. ఇది కిలోమీటరుకు 12 లీటర్ల ATFని వినియోగిస్తుంది. అంటే ఇది ఎయిర్‌బస్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. అయితే ప్రయాణికుల సంఖ్య 568 వరకు ఉంటుంది. ఇలా ఇంధన ధరలు పెరుగుతుంటే విమాన టికెట్స్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఒక వేళ విమాన టికెట్స్ ధరలు పెరిగితే ప్రయాణికులకు మరింత భారం కానుంది.