AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: 93 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి: ఆర్బీఐ

ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 2000 రూపాయలు డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మే 19, 2023న చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది..

RBI: 93 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి: ఆర్బీఐ
2000 Rupes
Subhash Goud
|

Updated on: Sep 01, 2023 | 10:00 PM

Share

2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవాలని, ఇందు కోసం ఈ నోట్లు కలిగి ఉన్న వారు బ్యాంకులో మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఇందుకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉంది. ఈ కరెన్సీని చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ తెలుపడంతో మే 19న చెలామణిలో ఉన్న రూ.2000 కరెన్సీ నోట్లలో 93 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. బ్యాంకుల నుంచి అందిన డేటా ప్రకారం.. ఆగస్టు 31, 2023 వరకు చెలామణి నుంచి తిరిగి పొందిన రూ. 2000 నోట్ల మొత్తం విలువ 3.32 లక్షల కోట్ల రూపాయలు అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా వెల్లడించింది.

ఆగస్టు 31, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ విధంగా మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 93 శాతం తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది.

ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 2000 రూపాయలు డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో, మిగిలిన 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. మే 19, 2023న చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మార్చి 31, 2023న 3.62 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని ఆర్బీఐ నివేధించింది. మే 19వ తేదీన బ్యాంకింగ్‌ సమయం ముగిసే వరకు 3.56 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిందని తెలిపింది.

అధిక విలువ కలిగిన 2000 రూపాయల నోటు సెప్టెంబరు 30, 2023 వరకు డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మిగిలిన కాలాన్ని ఉపయోగించుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అభ్యర్థించింది. అయితే ఈ 2000 రూపాయల నోట్లను మార్చుకోవాలంటే ఐడీ ఫ్రూప్‌ గానీ, ఇతర స్లిప్‌లు అవసరం లేదని ఆర్బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. మీ సమీపంలో ఉన్న బ్యాంకును సందర్శించి సులభంగా నోట్లను మార్చుకోవాలని లేదా మీ ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు కూడా ఎలాంటి ఐడీ రుజువు లేకుండా ఏదైనా బ్రాంచ్‌కు వెళ్లి నోట్లను మార్చుకోవచ్చని చెబుతోంది. ఒక వ్యక్తి రూ.2000 నోట్లను మార్చుకునేందుకు ఓకేసారి రూ.20 వేల వరకు పరిమితి ఉందని ఆర్బీఐ మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయితే సెప్టెంబర్‌ నెలలో బ్యాంకులకు 16 రోజుల పాటు సెలవులు వచ్చాయి. అందుకు వినియోగదారులు గడువు తేదీ చూడకుండా ముందస్తుగానే బ్యాంకులకు వెళ్లి మార్చుకోవడం బెటర్‌. లేకపోతే చివరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం