AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hamas-Israel War: త్వరలో భారతదేశంలో ఇంటర్నెట్ ఖరీదైనది కావచ్చు? కారణం ఏంటంటే!

ప్రస్తుతం 5G ఇంటర్నెట్ సేవలను అందించడంలో భారతదేశం అత్యంత వేగవంతమైనది. ఇది ఇప్పటికే దేశంలోని అనేక నగరాలకు చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇతర నగరాల్లో 5జీ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కానీ, యుద్ధం కారణంగా దేశంలో 5G టెక్నాలజీని విస్తరించడం కష్టం కావచ్చు. ఎందుకంటే 5G నెట్‌వర్క్‌కు అవసరమైన ప్రోడక్ట్స్‌ను దిగుమతి ఖరీదైనది కావచ్చు..

Hamas-Israel War: త్వరలో భారతదేశంలో ఇంటర్నెట్ ఖరీదైనది కావచ్చు? కారణం ఏంటంటే!
Hamas Israel War
Subhash Goud
|

Updated on: Oct 17, 2023 | 6:16 PM

Share

అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రతీకారంగా.. ఇజ్రాయెల్ తన సైన్యాన్ని గాజా స్ట్రిప్ సరిహద్దులో దింపింది. గత వారం రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరువర్గాలు నిత్యం దాడులు చేసుకుంటున్నాయి. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ యుద్ధం ప్రపంచ స్థాయిని కూడా ప్రభావితం చేస్తోంది. భారత్‌ను కూడా ఇందులో వదిలిపెట్టలేదు. దేశంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధం భారతదేశంలో ఇంటర్నెట్ ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం 5G ఇంటర్నెట్ సేవలను అందించడంలో భారతదేశం అత్యంత వేగవంతమైనది. ఇది ఇప్పటికే దేశంలోని అనేక నగరాలకు చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇతర నగరాల్లో 5జీ కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కానీ, యుద్ధం కారణంగా దేశంలో 5G టెక్నాలజీని విస్తరించడం కష్టం కావచ్చు. ఎందుకంటే 5G నెట్‌వర్క్‌కు అవసరమైన ప్రోడక్ట్స్‌ను దిగుమతి ఖరీదైనది కావచ్చు.

యుద్ధం కారణంగా భారం ఎక్కువ

భారతదేశంలో 5G ఇంటర్నెట్ సెటప్ కోసం అవసరమైన మెటీరియల్‌లను దిగుమతి చేసుకోవాలి. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా దిగుమతి చేసుకున్న 5G నెట్‌వర్క్ పరికరాల ధర రూ. 2,000-2,500 కోట్లు పెంచవచ్చు. దీని కారణంగా 5G కనెక్టివిటీపై పనిచేస్తున్న టెలికాం కంపెనీలకు 5G రోల్అవుట్ వేగం మందగించవచ్చు.

ఇవి కూడా చదవండి

టెలికాం కంపెనీలకు ఇబ్బంది

ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10% పడిపోతుంది. 3-4 శాతం మేర తగ్గవచ్చు. అటువంటి పరిస్థితిలో టెలికాం కంపెనీలకు విదేశీ ఖర్చులు చెల్లించడం ఖరీదైనది. స్థానిక ఫోన్ నెట్‌వర్క్‌లో ఉపయోగించే టెలికాం పరికరాలలో 67 శాతం దిగుమతి చేసుకున్నవే. దీని వల్ల రానున్న రోజుల్లో లాభం కూడా తగ్గవచ్చు.

ఇంటర్నెట్‌కు 5G కష్టం

ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ వంటి విదేశీ కంపెనీలు ఈ టెలికాం పరికరాలను భారతదేశానికి సరఫరా చేస్తాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు దెబ్బతింటాయి. అత్యంత వేగవంతమైన 5G కవరేజీని అందించడానికి టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. జియో, ఎయిర్‌టెల్‌ ఉచిత 5G ఇంటర్నెట్‌ను అందిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో 5G ఇంటర్నెట్ పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి