AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీని పునరుద్ధరించనున్నారా? నిబంధనలలో మార్పులు చేయవచ్చు!

రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రైల్వే శుభవార్త అందించనుంది. అలాంటి ప్రయాణీకులకు రైల్వే రాయితీని పునఃప్రారంభించవచ్చు. సీనియర్ సిటిజన్లు గతంలో రైలు టిక్కెట్లపై ఛార్జీలలో రాయితీని..

Indian Railway: సీనియర్ సిటిజన్లకు రైల్వే రాయితీని పునరుద్ధరించనున్నారా? నిబంధనలలో మార్పులు చేయవచ్చు!
Indian Railway
Subhash Goud
|

Updated on: Oct 19, 2022 | 9:15 AM

Share

రైలులో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు రైల్వే శుభవార్త అందించనుంది. అలాంటి ప్రయాణీకులకు రైల్వే రాయితీని పునఃప్రారంభించవచ్చు. సీనియర్ సిటిజన్లు గతంలో రైలు టిక్కెట్లపై ఛార్జీలలో రాయితీని పొందేవారు. కానీ కరోనా కాలంలో ప్రభుత్వం ఈ మినహాయింపును నిలిపివేసింది. ఇది ఇప్పటి వరకు కొనసాగుతోంది. ఈ విషయం పార్లమెంటుకు వెళ్లడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. ఇప్పుడు మళ్లీ రాయితీ నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఈ సమాచారం మీడియా నివేదికలో అందించబడింది. మీడియా కథనాల ప్రకారం.. టిక్కెట్లలో రాయితీని ఇవ్వడానికి వయోపరిమితిలో కొన్ని మార్పులు చేయాలని రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. అలాగే కొన్ని తరగతుల టిక్కెట్లపై మాత్రమే రాయితీ ప్రయోజనం ఇవ్వబడుతుంది. ఇంతకుముందు రైలులోని ప్రతి తరగతిలో సీనియర్ సిటిజన్లకు ఛార్జీలలో రాయితీ ఇవ్వబడింది. కానీ కరోనా కాలంలో రైలు సేవలు నిలిపివేసినందున ఛార్జీలలో మినహాయింపును నిలిపివేసింది కేంద్రం.

70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులకు టిక్కెట్లపై రాయితీ ఇవ్వాలని రైల్వే బోర్డు యోచిస్తోంది. తరగతికి సంబంధించినంత వరకు జనరల్, స్లీపర్ క్లాస్ టిక్కెట్లపై రాయితీ ప్రయోజనం ఇవ్వబడుతుంది. సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై సబ్సిడీని కొనసాగించడం ద్వారా రాయితీ ధరను తగ్గించాలనే ఆలోచన ఉందని రైల్వే తెలిపింది. అయితే రాయితీకి సంబంధించిన నిబంధనలు, షరతుల గురించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

రాయితీ నిబంధనలను పరిశీలిస్తున్నట్లు, దానిపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు రైల్వే అధికారుల ద్వారా సమాచారం. వృద్ధులకు రాయితీని పూర్తిగా రద్దు చేస్తామని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. కానీ సాధారణ, స్లీపర్ తరగతుల వరకు కొనసాగించవచ్చు. దీంతో 70 శాతం మంది ప్రయాణికులను ఈ రాయితీ సదుపాయం కలుగనుంది. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రారంభానికి ముందు, సీనియర్ సిటిజన్లకు రాయితీ కొనసాగుతోంది. ఇందులో 58 ఏళ్లు పైబడిన మహిళలు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు టిక్కెట్లలో మినహాయింపు ఇచ్చారు. రైల్వేలు అమలు చేస్తున్న ఈ పథకంలో మహిళా ప్రయాణికులకు 50 శాతం, పురుషులకు 40 శాతం రాయితీ టిక్కెట్టు ఛార్జీలలో లభించేది. ఈ నియమం ప్రతి తరగతికి సమానంగా వర్తిస్తుంది. కరోనా తర్వాత రైల్వేలు ఈ రాయితీని ఉపసంహరించుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి