AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ఈ రైళ్లు 9 రోజుల పాటు రద్దు.. కారణాలు వెల్లడించిన రైల్వే అధికారులు

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా ట్రాక్‌ మరమ్మతులను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల రద్దీని..

Indian Railways: ఈ రైళ్లు 9 రోజుల పాటు రద్దు.. కారణాలు వెల్లడించిన రైల్వే అధికారులు
Indian Railways
Subhash Goud
|

Updated on: Jan 22, 2023 | 8:59 AM

Share

ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. కొత్త కొత్త రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా ట్రాక్‌ మరమ్మతులను ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజురోజుకు రైళ్ల సంఖ్యను పెంచుతోంది ఇండియన్‌ రైల్వే. అయితే రైల్వే ట్రాక్‌ మరమ్మతులు, ఇతర కారణాల వల్ల కొన్ని రైళ్లను రద్దు చేస్తుంటుంది. అలాగే మరికొన్ని రైళ్ల సమయాల వేళల్లో మార్పులు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించడం వంటివి చేస్తుంటుంది. ఇందులో భాగంగా పలు రైళ్లు 9 రోజుల పాటు రద్దు చేస్తోంది. దీంతో ముందస్తుగా ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది. సెంట్రల్‌ రైల్వే పరిధిలోని దౌండ్‌-మన్మాడ్‌ నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

దౌండ్‌ నుంచి నిజామాబాద్‌కు వెళ్లే డెమొ రైలు జనవరి 20 నుంచి 28వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు, ఇది 9 రోజుల పాటు అందుబాటులో ఉండదని రైల్వే అధికారులు తె లిపారు. అలాగే నిజామాబాద్‌ నుంచి పుణె వెళ్లే డెమో రైలు జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉండదు. దీనిని కూడా రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే నిజామాబాద్‌-పండలిపూర్‌ వెళ్లే డెమో రైలు జనవరి 21 నుంచి అందుబాటులో ఉండదు. దీనిని రద్దు చేశారు. అలాగే న్యూఢిల్లీ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును మన్మాడ్‌, జగత్‌పురి, కల్యాణ్‌, పన్నేల్‌, పుణె, దౌండ్‌ మార్గాల్లో వివిధ కారణాల వల్ల దారి మళ్లించారు. జనవరి 27వ తేదీ నుంచి నడిచే బెంగళూరు-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును పుణెన, లోనావాలా, కజ్రత్‌, పన్వేల్‌, వాసాయ్‌ రోడ్‌, వడోదరా, రత్లామ్‌, మక్కి, సంత్‌ హిర్‌ధరమ్‌ మార్గంలో దారి మళ్లించారు. ఇక షిర్డీ నుంచి ఏపీ, తెలంగాణకు వచ్చే రైళ్లు ఈనెల 23 నుంచి 26 వరకు ఆలస్యంగా నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర వివరాలకు రైల్‌ సేవాను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఎల్లమ్మలో విలన్‌గా ఒకప్పటి లవర్ బాయ్..
ఎల్లమ్మలో విలన్‌గా ఒకప్పటి లవర్ బాయ్..
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి
పుష్కరానికోసారి పూసే అరుదైన పుష్పం.. చూడాలంటే అదృష్టం ఉండాలి
భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన'ఇరాన్'
భూమి కింద మిస్సైల్ బేస్‌.. ప్రపంచానికి చాటిన'ఇరాన్'
బీజేపీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
బీజేపీ మున్సిపల్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల
ఈ వస్తువులు మీ చేతుల్లోంచి జారిపడ్డాయా? అయితే జాగ్రత్త!
ఈ వస్తువులు మీ చేతుల్లోంచి జారిపడ్డాయా? అయితే జాగ్రత్త!
జలుబు లేదా ఫ్లూతో ఇబ్బందా.. ఒక్కసారి ఈ చికెన్ సూప్ ట్ర చేయండి..
జలుబు లేదా ఫ్లూతో ఇబ్బందా.. ఒక్కసారి ఈ చికెన్ సూప్ ట్ర చేయండి..
విమానంలో బాలున్ని ఎక్కనివ్వని ఎయిర్‌లైన్స్‌.. షాకిచ్చిన కోర్టు
విమానంలో బాలున్ని ఎక్కనివ్వని ఎయిర్‌లైన్స్‌.. షాకిచ్చిన కోర్టు
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది..
ప్రియుడిని పిలిచి ప్లాన్ చేసి.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లింది..
శివుడికి తులసిని ఎందుకు సమర్పించకూడదు..? ఆధ్యాత్మిక కారణాలివే
శివుడికి తులసిని ఎందుకు సమర్పించకూడదు..? ఆధ్యాత్మిక కారణాలివే
సముద్రంలో ఈది కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు
సముద్రంలో ఈది కుటుంబాన్ని కాపాడుకున్న 13 ఏళ్ల బాలుడు