AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: రైలు ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక చౌకగా వందే భారత్ రైలు టిక్కెట్లు

భారతీయ రైల్వే వందే భారత్‌కు సంబంధించి భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రైలు నెట్‌వర్క్‌ను పెంచేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి.

Vande Bharat Express: రైలు ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం.. ఇక చౌకగా వందే భారత్ రైలు టిక్కెట్లు
Vande Bharat Express
Subhash Goud
|

Updated on: Jan 21, 2023 | 10:34 AM

Share

భారతీయ రైల్వే వందే భారత్‌కు సంబంధించి భారీ ప్రణాళికను రూపొందిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రైలు నెట్‌వర్క్‌ను పెంచేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ప్రస్తుతం వందేభారత్ రైలులో టికెట్‌ ధరలు భారీగా ఉన్నాయి. అయితే ప్రయాణాన్ని చౌకగా చేసేందుకు స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. స్లీపర్ కోచ్ కారణంగా రైలు టిక్కెట్ కూడా చౌకగా మారుతుంది. దీంతో ప్రయాణ సమయంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తప్పడం లేదు.

  • స్పీడ్ గంటకు 200 కి.మీ: మీడియా నివేదికల ప్రకారం.. స్లీపర్ కోచ్‌తో వందే భారత్ రైలు వేగం గంటకు 200 కిమీ వరకు ఉంటుంది. ఈ రైలులోని స్లీపర్ కోచ్‌ను అల్యూమినియంతో తయారు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లు దేశవ్యాప్తంగా నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ కోచ్‌లకు ప్రత్యామ్నాయంగా మారనున్నాయి . దాదాపు 400 వందే భారత్ రైళ్లకు రైల్వే శాఖ టెండర్లు జారీ చేయగా, నెలాఖరులోగా ఆమోదం పొందనుంది.
  • రైలు ఎంత వేగంతో నడుస్తుంది?: ఈ రైళ్ల నిర్మాణ పనుల కోసం 4 దేశీయ కంపెనీలతో సహా విదేశీ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. మొదటి 200 వందే భారత్ రైళ్లలో శతాబ్ది ఎక్స్‌ప్రెస్ వంటి సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయి. ప్రస్తుతం ఈ రైళ్లు గంటకు 180 కి.మీ.
  • రైలు పట్టాల భద్రతపై శ్రద్ధ: రైలు ట్రాక్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని గంటకు 130 కిమీ వేగంతో నడిచేందుకు అనుమతిని పొందనున్నట్లు రైల్వే తెలిపింది. దీనితోపాటు చైర్ కార్ రైళ్లను ఉక్కుతో తయారు చేయనున్నారు.
  • రెండో దశలో 200 రైళ్లు: ఇక రెండో దశలో 200 స్లీపర్‌ కోచ్‌లతో వందేభారత్‌ రైళ్లను తయారు చేస్తామని రైల్వే తెలిపింది. ఈ రైళ్ల తయారీకి అల్యూమినియం వినియోగించనున్నారు. ఇందుకోసం రైల్వే ట్రాక్‌కు సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు సిగ్నల్, బ్రిడ్జి పనులు కూడా కొనసాగుతున్నాయి. ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై మధ్య ఈ పని జరుగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
డెలివరీ బాయ్‌కి ఎక్స్ట్రా మనీ ఇవ్వడం కరెక్టేనా?.. చట్టం ఏమంటోంది?
డెలివరీ బాయ్‌కి ఎక్స్ట్రా మనీ ఇవ్వడం కరెక్టేనా?.. చట్టం ఏమంటోంది?
కేవలం 5 నిమిషాల్లో టేస్టీ మజ్జిగచారు.. వేడి అన్నంలోకి అదిరిపోద్ది
కేవలం 5 నిమిషాల్లో టేస్టీ మజ్జిగచారు.. వేడి అన్నంలోకి అదిరిపోద్ది
ఇవి రెండు తింటే పడిపోయిన వాళ్ళు కూడా లేచి ఉరుకులు పెడతారు
ఇవి రెండు తింటే పడిపోయిన వాళ్ళు కూడా లేచి ఉరుకులు పెడతారు
వేడి నీటిలో వేయగానే రంగుమారే ఈ పువ్వు ప్రయోజనాలు తెలిస్తే..
వేడి నీటిలో వేయగానే రంగుమారే ఈ పువ్వు ప్రయోజనాలు తెలిస్తే..
పర్సనల్ లోన్ కంటే టాప్-అప్ లోన్ బెస్టా? అసలు లెక్క ఇదే!
పర్సనల్ లోన్ కంటే టాప్-అప్ లోన్ బెస్టా? అసలు లెక్క ఇదే!
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది..?
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది..?
ఏడాదిన్నర తర్వాత జిమ్‌లో అడుగుపెట్టిన భామ..
ఏడాదిన్నర తర్వాత జిమ్‌లో అడుగుపెట్టిన భామ..
అన్నమయ్యలో వెంకన్న స్వామి పాత్రను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే..?
అన్నమయ్యలో వెంకన్న స్వామి పాత్రను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే..?
నఖ్వీ రాకతో టీమిండియాకు కొత్త టెన్షన్
నఖ్వీ రాకతో టీమిండియాకు కొత్త టెన్షన్
ఇంటర్వ్యూకు వెళ్తుంటే దొంగని అరెస్ట్‌.. కట్‌చేస్తే ఊహించని మలుపు
ఇంటర్వ్యూకు వెళ్తుంటే దొంగని అరెస్ట్‌.. కట్‌చేస్తే ఊహించని మలుపు