Silver: బిగ్ షాక్.. భారీగా పెరగనున్న వెండి ధరలు! కారణం ఏంటంటే..?
ఇటీవలి బంగారం, వెండి ధరల భారీ హెచ్చుతగ్గులు జ్యువెలరీ వ్యాపారాన్ని కుదిపేశాయి. వెండి ధర కిలోకు రూ.2.9 లక్షలకు చేరడం, 2026 నాటికి రూ.4 లక్షలు దాటే అవకాశం ఉండటంతో కొనుగోళ్లు తగ్గి వ్యాపారులు నష్టపోతున్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణం.

ఇండియాలో గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇటీవలి కాలంలో జరిగిన భారీ హెచ్చుతగ్గులు జ్యువెలరీ బిజినెస్పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సిల్వర్ ధరల పెరుగుదల కారణంగా మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. 2026 జనవరిలో సిల్వర్ ధరలు రికార్డు స్థాయికి చేరుకుని కిలోకు సుమారు రూ.2.9 లక్షల వరకు పెరిగాయి. ధరలు ఎక్కువగా ఉండటంతో కస్టమర్లు కొనుగోళ్లకు వెనుకంజ వేస్తుండటంతో, ముఖ్యంగా వెడ్డింగ్ సీజన్లో కూడా సేల్స్ తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇరాన్, యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న కాన్ఫ్లిక్ట్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే ప్రకారం, పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఏడాది సిల్వర్ ధర కిలోకు రూ.4 లక్షలకు పైగా చేరే అవకాశముంది. ఇటీవలే ధరలు రూ.3 లక్షల స్థాయిని చేరుకునే ప్రయత్నం చేశాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలను నేరుగా నియంత్రించలేనప్పటికీ, ఇంపోర్ట్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం ద్వారా కొంత ఉపశమనం కల్పించవచ్చని వ్యాపారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని సుమారు 2 శాతం తగ్గిస్తే జ్యువెలరీ బిజినెస్కు గణనీయమైన ఊరట లభిస్తుందని వారు అంటున్నారు.
ఇదే సమయంలో నగల వ్యాపారుల సంస్థ అయిన రాష్ట్రీయ స్వర్ణార్ సంఘ్ నిర్వహించిన ఎమర్జెన్సీ మీటింగ్లో కొత్త స్ట్రాటజీ రూపొందించారు. ఆ సమావేశంలో బీహార్లోని ఖగారియా ఎంపీ రాజేష్ వర్మను సంస్థ కొత్త ప్రెసిడెంట్గా ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ జ్యువెలరీ వ్యాపారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి కొన్ని లీగల్ ప్రొవిజన్ల దుర్వినియోగమని తెలిపారు. ప్రత్యేకంగా ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 317 (పాత చట్టంలోని సెక్షన్ 411) కింద కొంతమంది పోలీసులు వేధింపులు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కస్టమర్లు తమ పాత గోల్డ్ లేదా సిల్వర్ అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు, ఆ వస్తువు అసలు సోర్స్ ఏమిటో జ్యువెలర్లకు తెలియదని వారు చెబుతున్నారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ల జోక్యాన్ని కోరుతూ జ్యువెలరీ అసోసియేషన్లు చర్యలు ప్రారంభించాయి. అలాగే ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ యోజన కింద గోల్డ్ స్మిత్లకు తగిన బెనిఫిట్స్ అందేలా చూడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నిర్వహించాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్లు వ్యాపార సంఘాలు తెలిపాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
