Income Tax Department: ఈ నగదు లావాదేవీలు జరిపినట్లయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయ్‌.. జాగ్రత్త..!

Income Tax Department: ప్రజల నగదు లావాదేవీలను తగ్గించడానికి ఆదాయపు పన్ను శాఖ, బ్యాంకు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, బ్రోకరేజీలు లాంటి వివిధ పెట్టుబడికి సంబంధించిన..

Income Tax Department: ఈ నగదు లావాదేవీలు జరిపినట్లయితే ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తాయ్‌.. జాగ్రత్త..!
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2021 | 7:52 AM

Income Tax Department: ప్రజల నగదు లావాదేవీలను తగ్గించడానికి ఆదాయపు పన్ను శాఖ, బ్యాంకు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు, బ్రోకరేజీలు లాంటి వివిధ పెట్టుబడికి సంబంధించిన ప్లాట్‌ఫామ్‌లు నిబంధనలు కఠినతరం చేశాయి. నగదు లావాదేవీలకు పరిమితులు విధించాయి. ఈ నిబంధ‌న‌లు ఉల్లంఘించినట్లయితే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. అయితే నోటీసులు పంపే అవకాశం ఉన్న ఐదు నగదు లావాదేవీలు ఇవే.

సేవింగ్‌, కరెంట్‌ అకౌంట్‌:

ఒక వ్యక్తి సేవింగ్‌ అకౌంట్‌లో నగదు డిపాజిట్‌ పరిమితి లక్ష రూపాయలు. సేవింగ్‌ ఖాతాలో లక్ష రూపాయలకు మించి డిపాజిట్‌ చేసినట్లయితే అదాయపు పన్ను నోటీసులు పంపే అవకాశం ఉంది. అదే విధంగా కరెంటు అకౌంట్‌లకు, పరిమితి రూ.50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినట్లయితే ఆదాయపు పన్ను శాఖ పంపే నోటీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (FD):

చిన్న పెట్టుబడి స్కీమ్‌లలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అనేది ఓ మంచి అవకాశం అనే చెప్పాలి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో నగదు డిపాజిట్‌ రూ.10 లక్షలకు మించకూడదు. బ్యాంకు డిపాజిటర్‌ ఒకరి బ్యాంకు ఎఫ్‌డీ ఖాతాలో అంతకు మించి నగదు డిపాజిట్‌ చేయకూడదు.

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల విషయంలో..

క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపు విషయంలో లక్ష రూపాయల పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపే అవకాశం ఉంటుంది. అందుకు సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది.

మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌ మార్కెట్‌, బాండ్‌..

మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్స్‌, బాండ్‌, డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వారు నగదు పెట్టుబడిగా 10 లక్షల రూపాయల పరిమితి మించకుండా చూసుకోవాలి. ఈ నగదు పరిమితి మించితే ఆదాయపు పన్ను శాఖ, మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్‌ను తనిఖీ చేస్తుంది.

రియల్‌ ఎస్టేట్‌:

ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రమించేటప్పుడు, రియల్‌ ఎస్టేట్‌ ఒప్పందంలో రూ.30 లక్షలు పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్సహించదు. కాగా,ఈ ఐటీ శాఖ నిబంధనల నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పరిమితికి మించి చేసే లావాదేవీల వివ‌రాలు సుల‌భంగా తెలిసిపోతాయి.

ఇవీ కూడా చదవండి

Personal Loan Limit: ఆర్బీఐ కీలక నిర్ణయం.. వ్యక్తిగత రుణాల పరిమితిని పెంచుతూ ప్రకటన.. కానీ వారికి మాత్రమే..!

Postal Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ఏడాదికి రూ.59,400.. ఎలాగంటే..!

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..