AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఐదువేల పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే, గవర్నెమెంటు ఉద్యోగి కన్నా ఎక్కువ సంపాదించే చాన్స్

ఉద్యోగాలు చేస్తూ విసిగిపోయి...వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు మనలో చాలా మందే ఉన్నారు. ఉద్యోగం చేస్తే వచ్చే చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా మందికి కష్టంగా మారింది.

Business Ideas: ఐదువేల పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే,  గవర్నెమెంటు ఉద్యోగి కన్నా ఎక్కువ సంపాదించే చాన్స్
Business Ideas
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: May 23, 2023 | 8:45 AM

Share

ఉద్యోగాలు చేస్తూ విసిగిపోయి…వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు మనలో చాలా మందే ఉన్నారు. ఉద్యోగం చేస్తే వచ్చే చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా మందికి కష్టంగా మారింది. పెరుగుతున్న ఖర్చులకు తగ్గుట్లుగా ఆదాయం లేకపోవడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  అందుకే కొంతమంది ఉద్యోగం చేస్తూనే…చక్కటి వ్యాపారం ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అవగాహన లేకపోవడం, రిస్క్ తీసుకునే సామర్థ్యం లేకపోవడం వల్ల వ్యాపారం ప్రారంభించేందుకు వెనకడుగు వేస్తున్నారు.

మీరు కూడా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే…మీకు అద్భుతమైన వ్యాపారం గురించి చెప్పబోతున్నాము. మీరు ఈ వ్యాపారాన్ని ప్రణాళికాబద్ధంగా ప్రారంభిస్తే… విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ వ్యాపారం కుల్హాద్‌కు సంబంధించినది. దేశంలో చాలా మంది ప్రజలు కుల్హాద్ వ్యాపారం ద్వారా చాలా సంపాదిస్తున్నారు. ఈమధ్యకాలంలో చాలా మంది ప్లాస్టిక్ కప్పులలో టీ తాగేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ లేదా ఏదైనా టీ షాపుల్లో కుల్హాద్‌లో టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుల్హాద్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

కుల్హాద్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఐదు వేల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. టీ కప్పులను మార్కెట్లలో చాలా సరసమైన ధరలకు విక్రయిస్తారు. టీ కుల్హాద్ ధర దాదాపు 50 రూపాయల వరకు ఉంది. మరోవైపు, లస్సీ కుల్హాద్ గురించి మాట్లాడితే, దాని ధర వందకు రూ.150వరకు పలుకుతోంది. మరోవైపు టీకప్పులు వందకు రూ.100కి సులభంగా లభిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

దేశంలో కుల్హాద్‌ను ప్రోత్సహించడానికి, భారత ప్రభుత్వం కుమ్హర్ సశక్తికరణ్ యోజనను కూడా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం పేద కుమ్మరులకు విద్యుత్‌ ,సుద్దను అందజేస్తోంది. దీని సహాయంతో కుమ్మరులు తమ ఇళ్లలో మట్టి కుల్హాద్‌లను తయారు చేసి మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. రోజూ కుల్హాద్‌ను తయారు చేసి విక్రయించినట్లయితే రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదించవచ్చు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే… ఈ వ్యాపారాన్నిఎంచుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.