లాస్ట్ మినెట్స్లో కూడా ఈజీగా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలానో ఇక్కడ తెలుసుకోండి!
మనం ఏదైనా ట్రిప్కు వెళ్లాలనుకున్నప్పుడు.. మనకు పెద్ద సమస్య ఏదైనా ఉందంటే.. అది ట్రైన్ టికెట్ను బుక్చేసుకోవడం. ఎందుకంటే ట్రైన్లో ప్రయాణాలను మన దేశంలో అంత డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పండగవేళల్లో మన టికెట్ కావాలనుకుంటే నెలలు ముందు బుక్చేసుకోవాల్సిందే. అయితే ట్రైన్ బయల్దేరే అరగంట ముందు కూడా మనం టికెట్ను బుక్ చేసుకునేందుకు ఒక ఆప్షన్ ఉంటుందని ఎంతమందికి తెలుసు.. చాలా మందికి తెలియదు. కాబట్టి చివరి నిమిషంలో రైలు టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంలో రైల్వే టిక్కెట్లు పొందడం అనేది ఒక సవాలు. ముఖ్యంగా దీపావళి వంటి పండుగల సమయంలో, రైలు టిక్కెట్లు దొరకడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు నెలలు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటారు. అయితే గతంలో 120 రోజులకు ముందే రైల్వే టికెట్ బుక్ చేసుకునేందుకు ఉన్న అవకాశాన్ని ఇప్పుడు రైల్వేశాఖ 60 రోజులకు కుదించింది. ఎందుకంటే ఇంత లాంగ్ గ్యాప్ ఉన్నందుకు కొందరు రైల్వే టికెట్స్ బుక్ చేసుకొని చివరి నిమిషంలో రద్దు చేసుకుంటారు. అలాంటి టికెట్స్ను ప్రయాణీకులు అందుబాటులో ఉంచేందుకు ప్రయాణ తేదీకి ముందు రోజు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి వీలుగా, రైల్వేశాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ సౌకర్యం తీసుకొచ్చింది. కానీ ఈ టిక్కెట్లు ఎక్కువ సమయం ఉండవు.. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇవి అమ్ముడవుతాయి. అయితే ఈ తత్కల్ టికెట్స్ తర్వాత కూడా మళ్లీ రైల్వే టికెట్స్ బుక్చేసుకునేందుకు రైల్వే శాఖ ఒక కొత్త ఆప్షన్ను తీసుకొచ్చింది. అదే కరెంట్ టికెట్..ఈ కరెంట్ టికెట్ ఆప్షన్ ద్వారా మనం రైలు బయలుదేరే చివరి నిమిషంలో కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఇదే మీ వ్యక్తిత్వం.. నిద్రించే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలానో తెలుసా
ప్రస్తుత బుకింగ్ అంటే ఏమిటి?( కరెంట్ బుకింగ్ టికెట్)
కరెంట్ బుకింగ్ టికెట్ అప్షన్ అంటే.. తత్కాల్ బుకింగ్ తర్వాత రైలులో కొన్ని సీట్స్ ఖాళీగా ఉంటాయి. అలా మిగిలిపోయిన సీట్లతో రైల్వే అధికారులు ఒక చార్జ్ ప్రిపేర్ చేస్తారు. అంటే, రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు ఈ చార్ట్ రెడీ చేస్తారు. ఆ ఛార్జ్లో ఖాళీగా ఉన్న సీట్లను తిరిగి బుకింగ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత, ఖాళీ సీట్లను కరెంట్ రిజర్వేషన్ పద్ధతి ద్వారా బుక్ చేసుకోవడానికి ప్రియాణికులకు అందుబాటులో ఉంచుతారు. రైలు బయలుదేరడానికి సరిగ్గా 30 నిమిషాల ముందు మీరు ఈ టికెట్స్ను బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా? ఇది తెలిస్తే అస్సలు వదలరు!
ప్రస్తుత( కరెంట్) టికెట్ను ఎలా బుక్ చేసుకోవాలి?
- ప్రస్తుత టిక్కెట్లను ఇప్పుడు IRCTC యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
- దీని కోసం, ముందుగా IRCTC రైల్ కనెక్ట్ యాప్ లేదా IRCTC వెబ్సైట్కి వెళ్లి లాగిన్ అవ్వండి.
- మీరు మీ ప్రయాణ తేదీని ఎంచుకొండి ఉదాహరణకు, మీరు ఆగస్టు 25, 2025న ప్రయాణించాలనుకుంటే, మీరు ఆ తేదీని ఎంచుకోవాలి.
- తర్వాత మీరు రైలు బయలుదేరే స్టేషన్, మీరు వెళ్లాలనుకుంటున్న గమ్యస్థానాన్ని ఎంచుకోవాలి.
- అప్పుడు ఆరూట్లో ఆ రోజు నడుస్తున్న రైళ్ల జాబితా మీకు కనిపిస్తుంది. మీకు ఆసక్తి ఉన్నదాన్ని ఎంచుకుని, తరగతిని ఎంచుకోవాలి
- సీట్లు ఉంటే, అది CURR_AVBL ని చూపుతుంది.
- మనం సమాచారంతో ఎంత త్వరగా బుక్ చేసుకుంటే, మనకు రైలు టికెట్ లభించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
- రైళ్లను బుక్ చేసుకునే ముందు, మీ సమాచారాన్ని ముందుగా నమోదు చేయడం వలన మీరు వేగంగా బుక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ “టీ” రోజూ ఒక్కకప్పు తాగండి.. ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే.. మీ జోలికి రావంతే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




