AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST: జనవరిలో 1.30 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూలు.. గతం కంటే 15 శాతం ఎక్కువ..

వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు 2022 జనవరిలోనూ 1.30 లక్షల కోట్లు​ దాటాయి. జనవరిలో 1.38 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.

GST: జనవరిలో 1.30 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూలు.. గతం కంటే 15 శాతం ఎక్కువ..
Money
Srinivas Chekkilla
|

Updated on: Jan 31, 2022 | 10:24 PM

Share

వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు 2022 జనవరిలోనూ 1.30 లక్షల కోట్లు​ దాటాయి. జనవరిలో 1.38 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2022, జనవరి 30 నాటికి జీఎస్​టీఆర్​-3బీ రిటర్న్​లు దాఖలైంది 1.05 కోట్లుగా తెలిపింది. దీంతో వరుసగా నాలుగో నెలలోనూ 1.30 లక్షల కోట్ల వసూళ్లు దాటినట్లయింది. జీఎస్​టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,38,394 కోట్ల ఆదాయం వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది. 2021 జనవరితో పోల్చితే ఈ మొత్తం 15 శాతం ఎక్కువని తెలిపింది.

ఇందులో కేంద్ర జీఎస్​టీ రూ.24,674 కోట్లు కాగా రాష్ట్రాల జీఎస్​టీ రూ.32,016 కోట్లుగా ఉంది. సమీకృత జీఎస్​టీ రూ.72,030 కోట్లు కాగా సెస్​ రూ.9,674 కోట్లు వసూలు అయింది. ఇప్పటి వరకు అత్యధికంగా జీఎస్​టీ వసూళ్లు 2021, ఏప్రిల్​లో రూ.1,39,708 కోట్లుగా ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే.. 2022, జనవరిలో వసూలైన జీఎస్​టీ.. 2021, జనవరితో పోలిస్తే 15 శాతం ఎక్కువగా ఉంది.

2020, జనవరితో పోలిస్తే 25 శాతం అధికమని తెలిపింది. ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకోవడం, జీఎస్​టీ ఎగవేత వ్యతిరేక చర్యలు తీసుకోవడం కారణంగా జీఎస్​టీ వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read Also..  Budget-2022: బడ్జెట్-2022పై మైనింగ్ రంగం ఆశలు.. ఎగుమతి సుంకాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి..