AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: మిడిసిపడుతున్న పసిడి.. పెట్టుబడి పెడితే లాభాలు సాధ్యమేనా?

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల మధ్య ఆగస్టు ఫ్యూచర్స్ ట్రేడ్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1,01,078కి చేరుకున్నాయి. ప్రపంచ ఈక్విటీలు ఒత్తిడిలో ఉండడడంతో సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారంలో పెట్టుబడి సురక్షితమేనా? భవిష్యత్‌లో లాభాలను ఇస్తుందా? వంటి విషయాలను తెలుసుకుందాం.

Gold Rates: మిడిసిపడుతున్న పసిడి.. పెట్టుబడి పెడితే లాభాలు సాధ్యమేనా?
Gold Investment
Nikhil
|

Updated on: Jun 16, 2025 | 9:30 PM

Share

ఇటీవల గోల్డ్ ఆగస్టు ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.91 శాతం పెరిగి రూ.1,00,276 వద్ద స్థిరపడింది. అలాగే సిల్వర్ ఫ్యూచర్స్ 0.57 శాతం లాభపడి కిలోకు రూ.1,06,493 వద్ద ముగిసింది. ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత , ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విస్తృత అమ్మకాల మధ్య సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా బంగారం నిలిచింది. ముడి చమురు ధరలు పెరగడంతో లోహాల పెరుగుదలకు కూడా కారణమైంది విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటే ప్రపంచ మార్కెట్లో బంగారం జీవితకాల గరిష్టాలను తిరిగి తాకవచ్చని నిపుణులు చెబుతున్నారు. రూపాయి బలహీనత కారణంగా బంగారం, వెండి రెండింటి ధరలు పెరుగుతున్నాయి. 

డాలర్ ఇండెక్స్‌లో హెచ్చుతగ్గులు, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా అస్థిరత అంచనా వేసినా వారపు ముగింపు ప్రాతిపదికన బంగారం ట్రాయ్ ఔన్సుకు 3,284 డాలర్ల వద్ద, వెండి 34 డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో కాల్పుల విరమణ కుదరకపోతే షార్ట్ సెల్లింగ్ మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్కెట్లో అధిక అస్థిరత ఉన్నందున వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలని, ప్రవేశం మరియు నిష్క్రమణ కోసం సాంకేతిక స్థాయిలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

ప్రపంచ అస్థిరత ఇంకా కొనసాగుతున్నందున కేంద్ర బ్యాంకు విధానాలు డేటాపై ఆధారపడి ఉండటంతో బంగారం, వెండి ధరలు సమీప భవిష్యత్తులో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. అయితే అనిశ్చితికి వ్యతిరేకంగా హెడ్జ్ కోరుకునే పెట్టుబడిదారులు బులియన్‌లో నిరంతర బలాన్ని కనుగొనవచ్చని వివరిస్తున్నారు. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ నష్టాలు కొనసాగితే రూపాయి ఒత్తిడిలో ఉంటే ధరలు మరింత పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి