AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone Idea: వొడాఫోన్-ఐడియా మూతపడనుందా? ప్రభుత్వ ప్రయత్నాలు ఏమిటి?

Vodafone Idea: ప్రస్తుతం వోడాఫోన్‌ ఐడియా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. మార్చిలో ప్రభుత్వం స్పెక్ట్రమ్ బకాయిల్లో రూ.36,950 కోట్లను ఈక్విటీగా మార్చింది. దీని ద్వారా 48.99 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలిచింది. ఈ బకాయిలు 2021కి ముందు స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించినవి. ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో తెలుసుకుందాం..

Vodafone Idea: వొడాఫోన్-ఐడియా మూతపడనుందా? ప్రభుత్వ ప్రయత్నాలు ఏమిటి?
Subhash Goud
|

Updated on: Jun 16, 2025 | 3:09 PM

Share

దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలలో ఒకటైన వొడాఫోన్ ఐడియా కష్టాలు తగ్గడం లేదు. కంపెనీకి కష్టాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అయితే, ప్రభుత్వం, కంపెనీ అధికారులు టెలికాం దిగ్గజాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ET నివేదిక ప్రకారం.. ప్రభుత్వం వొడాఫోన్ ఐడియా (Vi) కోసం ఒక ఉపశమన ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. కానీ దాని పెండింగ్ స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలను మాఫీ చేయకపోతే, కంపెనీ మనుగడ సాగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని టెక్‌ నిపుణులు చెబుతున్న మాట. ఈ బకాయిలను ఈక్విటీగా మార్చడానికి ఎటువంటి ప్రణాళిక లేదని, దీనివల్ల వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వ వాటా ప్రస్తుత 49 శాతానికి పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వం ఎలాంటి ఉపశమన ప్యాకేజీని ప్లాన్ చేస్తుందో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Health Tips: పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నిర్ణయించిన ఆరు సంవత్సరాల కాలానికి బదులుగా వోడాఫోన్ ఐడియా తన AGR బకాయిలను 20 సంవత్సరాలలో చెల్లించనివ్వడం ఒక ఆలోచన. AGR చెల్లింపు వ్యవధిని రూ. 18,064 కోట్ల స్థిర ఆరు వార్షిక వాయిదాల నుండి 20 సంవత్సరాలకు పైగా పొడిగించాలని ఒక అధికారి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. టెలికాం శాఖ ప్రకారం.. FY26 చివరి నాటికి Vi మొత్తం రూ. 18,064 కోట్లు చెల్లించాల్సి వస్తే, FY27 బిల్లు రాకముందే కంపెనీ వద్ద నిధులు ఉండవని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికానికి కంపెనీ నష్టం రూ.7,166.1 కోట్లుగా ఉంది. ఇది వార్షిక ప్రాతిపదికన కొంత తగ్గినా, డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే సుమారు రూ.500 కోట్లు పెరిగింది. అలాగే డిసెంబర్ క్వార్టర్‌లో రూ.6,609.3 కోట్ల వరకు నష్టం వచ్చింది. వొడాఫోన్-ఐడియా CEO అక్షయ్ మూంద్రా 2025 ఏప్రిల్ 17న టెలికాం శాఖకు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి మద్దతు లభించకపోతే 2026 మార్చి తర్వాత కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Inverter Battery: మీ ఇంట్లో ఇన్వర్టర్‌ ఉందా..? ఈ తప్పులు అస్సలు చేయకండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి