Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగానే బ్యాడ్‌న్యూస్.. షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?

గత రెండు రోజుల్లో బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,120కి చేరింది, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,610కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి ఇది నిజంగానే బ్యాడ్‌న్యూస్.. షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?
Gold Rates
Follow us

|

Updated on: Oct 18, 2024 | 7:30 AM

బంగారం ధరల్లో ప్రతీరోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధర.. ఇప్పుడు వరుసగా రెండు రోజులు నుంచి భారీగా పెరుగుతూపోతోంది. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ఏకంగా రూ. 720 మేరకు పెరిగి రూ. 78,120కి చేరింది. అటు 22 క్యారెట్ల తులం గోల్డ్‌ రూ. 660కి పైగా పెరిగి రూ. 71,610గా ఉంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకులు, గోల్డ్ రిజర్వ్‌ల నిల్వ వంటి అంశాలు గోల్డ్ రేట్స్‌పై ప్రభావం చూపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. మరి దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,760గా ఉంది, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 78,270కి ఎగబాకింది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,610గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,120 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,120 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,610 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 78,120 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,610గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 78,120 వద్ద కొనసాగుతోంది.

* ఇక విజయవాడలో కూడా 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,610కాగా,24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,120గా ఉంది.

* సాగరనగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,610గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,120 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తే.. వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. తాజాగా శుక్రవారం కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఢిల్లీతో పాటు, కోల్‌కతా, ముంబయి, పుణె వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 96,900కి చేరింది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,02,900గా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 1,03,100గా ఉంది. ఈ ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఇక మిస్డ్ కాల్ ద్వారా బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకోవచ్చు. బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇది చదవండి: లక్షకు రూ. 3 లక్షలు.. పైగా ప్రతీ ఏటా రూ. 12 వేలు.. మ్యాజిక్ చేసే మల్టీబ్యాగర్ స్టాక్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..