Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ప్రియులకు మళ్లీ షాక్‌.. వరుసగా రెండో రోజు పెరిగిన గోల్డ్‌ రేట్‌..

Gold Price Today: ఇటీవల బంగారం ధరల్లో హెచ్చ తగ్గులు భారీగా కనిపిస్తున్నాయి. గత వారం రోజుల క్రితం ఒక్కసారిగా భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్‌ తాజాగా మళ్లీ దూకుడుపెంచాయి. గడిచిన రెండు రోజుల్లో తులం బంగారంపై...

Gold Price Today: బంగారం ప్రియులకు మళ్లీ షాక్‌.. వరుసగా రెండో రోజు పెరిగిన గోల్డ్‌ రేట్‌..
Gold & Silver Price
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 10, 2022 | 6:02 AM

Gold Price Today: ఇటీవల బంగారం ధరల్లో హెచ్చ తగ్గులు భారీగా కనిపిస్తున్నాయి. గత వారం రోజుల క్రితం ఒక్కసారిగా భారీగా తగ్గిన గోల్డ్‌ రేట్స్‌ తాజాగా మళ్లీ దూకుడుపెంచాయి. గడిచిన రెండు రోజుల్లో తులం బంగారంపై రూ. 380 పెరగగా తాజాగా శనివారం కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరలో నేడు పెరుగుదల కనిపించింది. నేడు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలపై ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 46,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,150 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 51,000 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 47,680 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,010 గా నమోదైంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,800 కాగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 51,050 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,750వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 51,000 గా ఉంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 46,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 51,000 గా ఉంది.

వెండి ధరల విషయానికొస్తే..

వెండి కూడా బంగారంలో బాటలోనే సాగింది. కిలో వెండిపై ఏకంగా రూ. 800 పెరిగింది. శనివారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 55,000 కాగా, ముంబయిలో రూ. 55,000గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో శనివారం కిలో వెండి ధర రూ. 60,300 గా నమోదైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..