AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mudra Loan: మీరు ముద్ర లోన్‌ తీసుకుంటున్నారా? ఇప్పుడు అంతా సులభం కదండోయ్‌.. నిబంధనలు మార్పు!

దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 'ప్రధానమంత్రి ముద్రా యోజన'ను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం సాధారణ ప్రజలకు రాయితీ ధరలకు సులభంగా రుణాలను అందిస్తుంది. దీనికి ప్రభుత్వమే హామీ ఇస్తుంది. అయితే ఈ రుణాన్ని త్వరలో పొందడం ప్రజలకు కొంత కష్టంగా మారవచ్చు, ఎందుకంటే దీని నియమాలు కఠినంగా ఉండనున్నాయి..

Mudra Loan: మీరు ముద్ర లోన్‌ తీసుకుంటున్నారా? ఇప్పుడు అంతా సులభం కదండోయ్‌.. నిబంధనలు మార్పు!
Mudra Loan
Subhash Goud
|

Updated on: Aug 17, 2024 | 6:50 AM

Share

దేశంలో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ముద్రా యోజన’ను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వం సాధారణ ప్రజలకు రాయితీ ధరలకు సులభంగా రుణాలను అందిస్తుంది. దీనికి ప్రభుత్వమే హామీ ఇస్తుంది. అయితే ఈ రుణాన్ని త్వరలో పొందడం ప్రజలకు కొంత కష్టంగా మారవచ్చు, ఎందుకంటే దీని నియమాలు కఠినంగా ఉండనున్నాయి. ఇందుకోసం నీతి ఆయోగ్ కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేసింది. 2024 బడ్జెట్‌లో ఈ లోన్ గరిష్ట పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సమయంలో ఈ నివేదిక వచ్చింది.

ఇక నుంచి ముద్రా రుణం ఇచ్చే ముందు రుణం తీసుకున్న వ్యక్తి నేపథ్యాన్ని పరిశీలించాలని నీతి ఆయోగ్ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేకాదు రుణం తీసుకునే అర్హత ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఇవే కాకుండా నీతి ఆయోగ్ తన నివేదికలో మరిన్ని సూచనలు చేసింది.

నీతి ఆయోగ్ నివేదిక

ప్రధాన మంత్రి ముద్రా యోజనను అంచనా వేస్తూ నీతి ఆయోగ్ ‘పీఎంఎంవై నివేదికపై నీతి ఆయోగ్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్’ నివేదికను విడుదల చేసింది. లోన్ అండర్ రైటింగ్ కోసం ఇ-కెవైసిని ప్రోత్సహించాలని తెలిపింది. ఇది రుణం నుండి పొందిన ప్రయోజనాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.

ఇది మాత్రమే కాదు.. నీతి ఆయోగ్ మార్గదర్శకాల సమితిని కూడా సిద్ధం చేసింది. ఇది రుణం తీసుకునే వ్యక్తి నేపథ్య ధృవీకరణ, రుణం తీసుకునే అతని సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది. రుణ డిఫాల్ట్ విషయంలో ఇది బ్యాంకులకు భద్రతా వలయాన్ని కూడా అందిస్తుంది. ఈ లోన్‌లను పొందేందుకు ఎలాంటి తనఖా అవసరం లేదు కాబట్టి, రిస్క్ సరైన అంచనా ఈ పథకం విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

చిరు వ్యాపారులు అప్పులు చేస్తారు

ముద్రా రుణాలు తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది చిన్న రుణగ్రహీతలు, చిన్న వ్యాపారులు ఉన్నారు. వారికి తగినంత పత్రాలు లేవు లేదా చాలా పరిమిత పత్రాలు ఉన్నాయి. అందువల్ల, బ్యాంకులకు వాటి ధృవీకరణ అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. ఇది బ్యాంకుల పనిని సులభతరం చేయడమే ఇ-ధృవీకరణ ఉద్దేశ్యం. కానీ గ్రౌండ్ లెవెల్లో దాని సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే ప్రజలు మరింత ఎదుర్కొనే అవకాశం ఉంది. రుణాలు తీసుకోవడంలో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

ఈ పథకాన్ని 2015లో ప్రభుత్వం ప్రారంభించింది. ముద్రా యోజన అధికారిక పోర్టల్ ప్రకారం, ఇప్పటివరకు 39.93 కోట్ల రుణాలు ఆమోదించబడ్డాయి. దీని కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.18.39 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసింది.

ఇది కూడా చదవండి: Indonesia: భారత్‌ సహా 20 దేశాల పర్యాటకుల కోసం ఇండోనేషియా కీలక నిర్ణయం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..