AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart: ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నం..

అయితే కంపెనీ మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నానికి తెర తీసింది. వస్తువులను బుక్‌ చేసిన రోజే డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌ కార్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాల్లో...

Flipkart: ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీ.. ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నం..
Flipkart
Narender Vaitla
|

Updated on: Feb 01, 2024 | 5:56 PM

Share

ఈ-కామర్స్‌ రంగం రోజురోజుకీ విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు క్రేజ్‌ పెరుగుతోంది. అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్‌. చివరికి పాల ప్యాకెట్లు కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ పెట్టే రోజులు వచ్చేశాయ్‌. గ్రాసరీ ఐటెమ్స్‌ను నిమిషాల వ్యవధిలోనే అందిస్తున్నాయి. ఇక అమెజాన్‌ ప్రైమ్‌ లాంటి సేవలను ఎలాంటి వస్తువులనైనా ఒక రోజులో అందిస్తున్నాయి.

అయితే కంపెనీ మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ సరికొత్త ప్రయత్నానికి తెర తీసింది. వస్తువులను బుక్‌ చేసిన రోజే డెలివరీ చేసేందుకు ఫ్లిప్‌ కార్ట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాల్లో తొలుత ఈ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడతో పాటు అహ్మదాబాద్‌, బెంగళూరు, భువనేశ్వర్‌, కోయంబత్తూరు, చెన్నై, దిల్లీ, గువాహటి, ఇందౌర్‌, జైపుర్‌, కోల్‌కతా, లఖ్‌నవూ, లుథియానా, ముంబయి, నాగ్‌పూర్‌, పుణె, పట్నా, రాయ్‌పుర్‌, సిలిగురి నగరాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. కాలక్రమేణ ఈ సేవలను దేశమంతా విస్తరించేందుకు ఫ్లిప్‌కార్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయన్న దానిపై ఇంకా ఎలాంటి తేదీ ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే మొబైల్స్, బుక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ వంటి వస్తువులను బుక్‌ చేసిన రోజే కస్టమర్లకు అందించాలని ఫ్లిప్‌కార్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అదే రోజు డెలివరీ పొందాలంటే కస్టమర్లు మధ్యాహ్నం ఒంటి గంటలోపే వస్తువులను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఆ రోజు అర్థరాత్రి 12 గంటలలోపు వస్తువులు డెలివరీ చేస్తారు. ఒకవేళ మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత బుక్ చేసినట్లయితే మరుసటి రోజు డెలివరీ అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?