AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Calender: ముఖ్యమైన పనులు చేసుకునేందుకు ఈ నాలుగు తేదీలను గుర్తించుకోండి.. లేకపోతే ఇబ్బందులు పడతారు..!

Financial Calender: మీరు ఆర్థిక ప్రణాళికలు చేస్తున్నట్లయితే కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోండి. దీనివల్ల ఆర్థికపరమైన విషయాల్లో మీరు సులభంగా వ్యవహరించవచ్చు...

Financial Calender: ముఖ్యమైన పనులు చేసుకునేందుకు ఈ నాలుగు తేదీలను గుర్తించుకోండి.. లేకపోతే ఇబ్బందులు పడతారు..!
Subhash Goud
|

Updated on: Jan 31, 2022 | 9:59 AM

Share

Financial Calender: మీరు ఆర్థిక ప్రణాళికలు చేస్తున్నట్లయితే కొన్ని ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోండి. దీనివల్ల ఆర్థికపరమైన విషయాల్లో మీరు సులభంగా వ్యవహరించవచ్చు. చివరి తేదీ దాటిపోయి, మీరు ఆ పనిని చేసుకోకపోతే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు జరిమానా చెల్లించవలసి రావచ్చు. ఇందు కోసం ఇక్కడ 4 ముఖ్యమైన తేదీల గురించి ప్రస్తావిస్తున్నాము.ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని పనులు చేసుకుంటే బెటర్‌. ట్యాక్స్‌ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేయడం, GST వార్షిక రిటర్న్ ఫైల్ చేయడం, ITR ఫైల్ చేయడం, KYC అప్‌డేట్ కోసం, అలాగే పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడం వంటివి ఉన్నాయి. ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 28, మార్చి 15, మార్చి 31 తేదీలు ముఖ్యమైనవి ఉన్నాయి.

ఫిబ్రవరి -15

పన్ను ఆడిట్ నివేదికను ఫైల్ చేయడానికి ఫిబ్రవరి 15, 2022 చివరి తేదీ. అంతకుముందు దాని తేదీ జనవరి 15, కానీ కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వం దానిని ఫిబ్రవరి 15 వరకు గడువు విధించింది. పన్ను ఆడిట్ నివేదికను జరిమానా లేకుండా ఫిబ్రవరి 15 వరకు దాఖలు చేయవచ్చు. మరోవైపు, కొత్త ఐటీ పోర్టల్‌ను ఉపయోగించడంలో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ, పన్ను ఆడిట్ నివేదికను జరిమానా లేకుండా సమర్పించేందుకు మార్చి 31 వరకు సమయం కోరింది. దీనికి సంబంధించి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ JB మహాపాత్రకు మెమోరాండం ఇచ్చింది.

ఫిబ్రవరి – 28

2020-21 ఆర్థిక సంవత్సరానికి GST వార్షిక రిటర్న్‌ను దాఖలు చేయడానికి ఫిబ్రవరి 28 చివరి తేదీ. అంటే, ఈ తేదీకి ముందు, ఆ రోజులోపు GST వార్షిక నివేదికను దాఖలు చేయడం అవసరం. గడువు దాటితే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్‌లో వార్షిక జీఎస్టీ రిటర్న్‌ల దాఖలుకు ప్రభుత్వం చివరి తేదీని 2 నెలలు పొడిగించింది. ఇంతకు ముందు ఈ తేదీ 31 డిసెంబర్ 2021 ఉండేది. ఇప్పుడు ఈ గడువు ఫిబ్రవరి 28 పెంచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఫారమ్ GSTR-9, ఫారమ్ GSTR-9C రూపంలో స్వీయ-ధృవీకరించబడిన సయోధ్య ప్రకటనలను ఫిబ్రవరి 28లోపు దాఖలు చేయవచ్చు.

మార్చి 15

ఆడిట్ రిపోర్ట్ కేసులో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 15 చివరి తేదీ. ఈ రిటర్న్‌ను సాధారణ ప్రజలు దాఖలు చేయరు. కార్పొరేట్ రంగానికి సంబంధించినది. ఇటీవల ప్రభుత్వం దాని చివరి తేదీని మార్చి 15 వరకు పొడిగించింది. ఈ కొత్త తేదీ అసెస్‌మెంట్ సంవత్సరానికి 2021-22. అంటే కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను మార్చి 15 వరకు దాఖలు చేయవచ్చు. కంపెనీలకు 2020-21 ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును పొడిగించడం ఇది మూడోసారి. కంపెనీల ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 31.

మార్చి-31

చాలా ముఖ్యమైన పనులు మార్చి 31లోగా పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా, బ్యాంక్ ఖాతాల కోసం KYCని అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ. మార్చి 31లోపు బ్యాంక్ ఖాతాలో KYCని అప్‌డేట్ చేయాలని నిర్ధారించుకోండి. తర్వాత మీకు అవకాశం లభించదు. దీని తేదీ ఇప్పటికే చాలాసార్లు పొడిగించారు. అదేవిధంగా, పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31. పాన్, ఆధార్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. ఈపీఎఫ్ ఖాతాలో ఈ రెండింటికి లింక్ లేకపోతే డబ్బు డిపాజిట్ చేయడంలో లేదా పాస్‌బుక్ చూడటంలో సమస్య తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యమైన లేదా సవరించిన రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీ. ఈ తేదీలను గుర్తించుకుని పనులు పూర్తి చేసుకోవడం ఎంతో మంచిది. లేకపోతే జరిమానాతో పాటు మరికొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరిలో సెలవులు ఇలా.. కొద్దిగా ప్లాన్ చేసుకోండే..

Edible Oil: వినియోగదారులకు షాక్‌.. త్వరలో పెరగనున్న వంట నూనె ధలు..!