Edible Oil Prices: రిటైల్ మార్కెట్లో తగ్గుముఖం పడుతోన్న వంట నూనె ధరలు.. ఇంకా తగ్గుతాయా?
అంతర్జాతీయంగా ధరలు కాస్త తగ్గడం, ప్రభుత్వ చర్యల వల్ల రిటైల్ మార్కెట్లో వంట నూనెల ధరల తగ్గుముఖం పట్టాయని ఫుడ్ సెక్రటరీ సుదర్శన్ పాండే తెలిపారు...

అంతర్జాతీయంగా ధరలు కాస్త తగ్గడం, ప్రభుత్వ చర్యల వల్ల రిటైల్ మార్కెట్లో వంట నూనెల ధరల తగ్గుముఖం పట్టాయని ఫుడ్ సెక్రటరీ సుదర్శన్ పాండే తెలిపారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం పల్లినూనె కాకుండా మిగతా ప్యాకేజీ వంట నూనెలు రిటైల్ మార్కెట్లో స్వల్పంగా తగ్గాయి. ఈ నెల ప్రారంభంలో పల్లినూనె రూ.150 నుంచి రూ.190 ఉంది. గత వారం ఎడిబల్ ఆయిల్ కంపెనీలు అయిన అదానీ విల్మర్, మదర్ డైరీ పలు రకాల వంట నూనెలపై రూ. 10 నుంచి రూ.15 వరకు తగ్గించాయి. తగ్గిన ధరలతో స్టాక్ త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని రెండు కంపెనీలు ప్రకటించాయి. “ప్రభుత్వం సరైన సమయంలో చర్యలు తీసుకోవడం వల్ల వంట నూనెల ధరలు తగ్గాయి” అని పాండే చెప్పారు. కేవలం ఎడిబుల్ ఆయిల్స్ కాకుండా రిటైల్లో గోధుమలు, గోధుమ పిండి ధరలు తగ్గాయని చెప్పారు. ప్రముఖ వంట నూనెల ఎమ్మార్పీ రేట్లు రూ.10 నుంచి రూ. 15 తగ్గినట్లు ఆహార శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు.
వినియోగదారుల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం సగటు కిలో పల్లీనూనె ధర జూన్ 1న రూ.186.43 ఉండగా అది జూన్ 21 నాటికి రూ.188 లకు పెరిగింది. మస్టర్డ్ ఆయిల్ ధరలు కాస్త తగ్గాయి. జూన్ 1న రూ.183.68 ధర జూన్ 21కి రూ.180.85లకు తగ్గింది. వనస్పతి కిలో రూ.165గా ఉంది. సోయ ఆయిల్ రూ.169 నుంచి రూ.167లకు తగ్గింది. సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కాస్త తగ్గింది. రూ.193 నుంచి 189.99కి తగ్గింది. పామయిల్ ధర రూ.156.4 నుంచి రూ.152.52కు తగ్గింది. 22 నిత్యావసర వస్తువుల ధరలను ఆహార శాఖ (బియ్యం, గోధుమలు, అట్టా, గ్రాము పప్పు, తురుము (అర్హర్) పప్పు, ఉరద్ పప్పు, మూంగ్ పప్పు, మసూర్ పప్పు, చక్కెర, గుర్, వేరుశెనగ నూనె, ఆవాల నూనె, వనస్పతి, పొద్దుతిరుగుడు నూనె, సోయా ఆయిల్ ధరలను పర్యవేక్షిస్తుంది. భారత్ 60 శాతం సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. తాజా పరిణామాలు చూస్తోంటే రాబోయే రోజుల్లో వంటనూనెల ధరలు మరింత తగ్గొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.